Webdunia - Bharat's app for daily news and videos

Install App

#ModixijinpingMeet మహాబలిపురాన్ని ఇందుకే ఎంపిక చేశారట....

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (09:49 IST)
భారత్‌లోని సర్వాంగసుందరంగా ఉండే సముద్రతీర ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటివాటిలో మహాబలిపురం ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర రాజధాని చెన్నైకు సమీపంలో ఉంది. అయితే, ఇలాంటి పర్యాటక ప్రాంతాలు, నగరాలు భారత్‌లో ఎన్నో ఉన్నాయి. కానీ, భారత్ - చైనా దేశాధినేతల భేటీకి మహాబలపురాన్ని మాత్రమే ఎంపిక చేశారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. 
 
దాదాపు 1200 సంవత్సరాల క్రితం... అంటే 7, 8 శతాబ్దాల సమయంలో మహాబలిపురాన్ని పల్లవ రాజులు ఎంతో అద్భుతంగా పాలించారు. తీర్చిదిద్దారు దీన్ని ఓ మహానగరంగా మార్చారు. ఈ నగరానికి, చైనాకు ఓ చారిత్రక అనుబంధం ఉంది. మూడో పల్లవరాజు కుమార విష్ణువు ఎన్నో యుద్ధ విద్యల్లో, వైద్య కళల్లో నిష్ణాతుడు. ఆయన బౌద్ధమతం స్వీకరించి, ఓ పని నిమిత్తం చైనాకు వెళ్లిపోయి అక్కడే ఉండిపోతాడు. చైనాలో ఆయన బోధి ధర్ముడుగా మారిపోయారు. 
 
చైనాలో బోధి ధర్ముడు ఎంతో ఆరాధ్యుడు. అక్కడి ప్రజలు నిత్యమూ ఆయన్ను పూజిస్తుంటారు. ఈ కారణం చేతనే తమకు ఆరాధ్యుడైన కుమార విష్ణువు నడయాడిన ప్రాంతాన్ని తిలకించాలని భావించిన జిన్ పింగ్, మహాబలిపురాన్ని ఎంచుకున్నారు. కాగా, బోధి ధర్ముడి కథపై ఆ మధ్య సూర్య, శ్రుతి హాసన్ జంటగా ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments