Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇమ్రాన్‌కు కంటిమీద కనుకు లేకుండా చేసిన జీ జిన్‌పింగ్

ఇమ్రాన్‌కు కంటిమీద కనుకు లేకుండా చేసిన జీ జిన్‌పింగ్
, శుక్రవారం, 11 అక్టోబరు 2019 (09:39 IST)
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు రానున్నారు. భారత్ చైనా ద్వైపాక్షిక చర్చల కోసం వచ్చే ఆయన చెన్నైకు చేరుకుంటారు. ఆ తర్వాత చెన్నై సముద్ర తీర పర్యాటక ప్రాంతమైన మహాబలిపురంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఉన్నతస్థాయి చర్చలు జరుపుతారు. 
 
అయితే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు బయలుదేరేముందు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు తేరుకోలేని షాకిచ్చారు. కాశ్మీర్ అంశం పూర్తిగా ద్వైపాక్షిక అంశమేనంటూ తేల్చి చెప్పారు.  
 
నిజానికి చైనా అధ్యక్షుడి పర్యటన శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. అయితే, 36 గంటల క్రితం వరకూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాలోనే ఉన్నారు. బీజింగ్‌లో జిన్‍పింగ్‌తో చర్చలు జరిపారు కూడా. ఆ సమయంలో కాశ్మీర్ అంశం ప్రస్తావనకు రాగా, ఈ వ్యవహారాన్ని ఇండియా, పాకిస్థాన్‌లు ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాల్సిందే మినహా, మరో దేశం కల్పించుకునే పరిస్థితి లేదని జిన్‌పింగ్ కుండ బద్దలు కొట్టారు. 
 
ఇటీవలి ఐరాస సమావేశాల్లో పాకిస్థాన్‌కు కొంత అనుకూలంగా మాట్లాడిన చైనా, ఆపై వారం రోజులు గడిచేసరికి, స్వరాన్ని మార్చుకోవడం భారత్ సాధించిన దౌత్య విజయమే. అంతేకాకుండా, చైనా అధ్యక్షుడి భారత్ పర్యటన పాకిస్థాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగేళ్ల చిన్నారికి ఈత నేర్పడానికి వెళితే...