ఇమ్రాన్‌కు కంటిమీద కనుకు లేకుండా చేసిన జీ జిన్‌పింగ్

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (09:39 IST)
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు రానున్నారు. భారత్ చైనా ద్వైపాక్షిక చర్చల కోసం వచ్చే ఆయన చెన్నైకు చేరుకుంటారు. ఆ తర్వాత చెన్నై సముద్ర తీర పర్యాటక ప్రాంతమైన మహాబలిపురంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఉన్నతస్థాయి చర్చలు జరుపుతారు. 
 
అయితే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు బయలుదేరేముందు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు తేరుకోలేని షాకిచ్చారు. కాశ్మీర్ అంశం పూర్తిగా ద్వైపాక్షిక అంశమేనంటూ తేల్చి చెప్పారు.  
 
నిజానికి చైనా అధ్యక్షుడి పర్యటన శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. అయితే, 36 గంటల క్రితం వరకూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాలోనే ఉన్నారు. బీజింగ్‌లో జిన్‍పింగ్‌తో చర్చలు జరిపారు కూడా. ఆ సమయంలో కాశ్మీర్ అంశం ప్రస్తావనకు రాగా, ఈ వ్యవహారాన్ని ఇండియా, పాకిస్థాన్‌లు ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాల్సిందే మినహా, మరో దేశం కల్పించుకునే పరిస్థితి లేదని జిన్‌పింగ్ కుండ బద్దలు కొట్టారు. 
 
ఇటీవలి ఐరాస సమావేశాల్లో పాకిస్థాన్‌కు కొంత అనుకూలంగా మాట్లాడిన చైనా, ఆపై వారం రోజులు గడిచేసరికి, స్వరాన్ని మార్చుకోవడం భారత్ సాధించిన దౌత్య విజయమే. అంతేకాకుండా, చైనా అధ్యక్షుడి భారత్ పర్యటన పాకిస్థాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments