Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై వైఎస్ఆర్‌సీపీ ఫోరం సర్వే... షాకిచ్చిన రిజల్ట్...

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (13:20 IST)
ysrcp forum
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇపుడు మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్‌గా ఉంది. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు ఒక్క వైపాకా మినహా మిగిలిన పార్టీలన్నీ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీరికి రాష్ట్ర ప్రజలతో పాటు రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు గత 52 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్‌సీపీ ఫోరం పేరుతో ఓ ఫేస్‌బుక్ ఖాతా ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనే అంశంపై ఓ సర్వేను నిర్వహించారు. పార్టీలకు అతీతంగా మీ అభిప్రాయాలను వెల్లడించింది. మన రాజధాని అమరావతి అయితే బాగుంటుందా? విశాఖపట్టణం అయితే బాగుంటుందా? అందరూ పాల్గొనాలని మనవి అంటూ సర్వే పోస్ట్ చేసింది. 
 
ఈ సర్వేలో అమరావతికి 77 శాతం మంది మద్దతు తెలుపగా, విశాఖపట్టణానికి 23 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. ఈ సర్వేను జనవరి 19వ తేదీ మధ్యాహ్నం 1.25 గంటలకు పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు మొత్తం 1.13 లక్షల మంది ఓట్లు వేయగా, 1.1 లక్షల మంది కామెంట్స్, 2.8 లక్షల మంది మంది షేర్ చేశారని, ఆయన స్క్రీన్ షాట్ తీసి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments