Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 రూపాయల డాక్టర్: కరోనావైరస్ హాంఫట్, హైదరాబాదులో ఎక్కడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (09:19 IST)
కరోనా ఇప్పుడు కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులకు కాసులను కురిపిస్తోంది. వైరస్ బారిన పడి ఒక్కసారి ఆసుపత్రి మెట్లెక్కితే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోవాల్సిందేననే టాక్ విపరీతంగా వినిపిస్తోంది. అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం ఒక డాక్టర్ కేవలం 10 రూపాయల ఫీజుతో కరోనాకు వైద్యం చేస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన కరోనా రోగులకు మొదటి నుంచి చివరి వరకు అయ్యే ఫీజు 15 వేల నుంచి 20 వేల లోపే. మరి ఈ పేదల డాక్టర్ ఇంత చీప్‌గా కరోనా రోగులకు ఎలా సేవ చేయగలుతున్నారో తెలుసా..?
 
హైదరాబాద్ నగరంలోని బోడుపల్ పరిసరాల్లో డాక్టర్ ఇమానుయేల్ ప్రజ్వ ఆసుపత్రిని నడుపుతున్నారు. ఆయన ఎంబిబిఎస్ చేశారు. తరువాత వివిధ ఆసుపత్రులలో పనిచేశారు. కొంతకాలం కిందటే ప్రజ్వ క్లినక్‌ను ఆరంభించారు. ప్రస్తుతం ఆయన తన ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు 10 రూపాయల ఫీజు తీసుకుని వైద్యం అందిస్తున్నారు.
 
ఆయన ఆసుపత్రికి వచ్చేవారు తెల్లరేషన్ కార్డులను కలిగిన నిరుపేదలైతే ఉచితంగానే వైద్యం చేస్తున్నారట. అవసరమైన మందులు, బెడ్‌కి సైతం నామమాత్రపు ఫీజులనే తీసుకుంటున్నారట. ఆర్మీలో పనిచేసే వారికి, దివ్యాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులు, పేదలకైతే జబ్బు నయమయ్యేంత వరకు ఉచితంగానే వైద్యం అందిస్తున్నారు. ఆయన మాకు దేవుడు అంటూ చికిత్స తీసుకుని ఆరోగ్యం కుదుటపడినవారు చేతులెత్తి దణ్ణం పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments