Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నాకేమైనా మావిడాకులు కావాలా? నాకు విడాకులే కావాలి' .. 'జంబలకిడి పంబ' టీజర్

హాస్యనటుడిగా వెండితెరకు పరిచయమై, కథానాయకుడిగా అలరిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి నటించిన తాజా చిత్రం 'జంబలకిడిపంబ'. సిద్ధి ఇద్నానీ కథానాయిక. జేబీ మురళీ కృష్ణ(మను) దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణజరుపుకొంటున్న

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (10:06 IST)
హాస్యనటుడిగా వెండితెరకు పరిచయమై, కథానాయకుడిగా అలరిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి నటించిన తాజా చిత్రం 'జంబలకిడిపంబ'. సిద్ధి ఇద్నానీ కథానాయిక. జేబీ మురళీ కృష్ణ(మను) దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణజరుపుకొంటున్న ఈ చిత్ర టీజర్‌ను గురువారం యువ కథానాయకుడు నాని విడుదల చేశారు.
 
నిజానికి గతంలో ఇదే పేరుతో ఓ చిత్రం వచ్చింది. ఈ చిత్రానికి దివంగత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎంతో ప్రజాధారణ పొందింది. బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులను కితకితలు పెట్టి గుక్క తిప్పుకోనీయకుండా నవ్వించేసింది. ఆ సినిమాకు సంబంధించి టెలివిజన్‌లో ఒక్క సీన్‌ వచ్చినా చాలు ఇప్పటికీ పడిపడి నవ్వేస్తారు. ఇప్పుడు ఇదే పేరుతో శ్రీనివాస్ రెడ్డి హీరోగా వస్తున్న చిత్రమే ఈ 'జంబలకిడి పంబ'. 
 
'నాకు విడాకులు కావాలి సర్' అంటూ కథానాయిక అంటే, 'నాకేమైనా మావిడాకాలు కావాలా? నాకు విడాకులే కావాలి' అంటూ శ్రీనివాస్‌రెడ్డి వేసే పంచ్‌ కితకితలు పెడుతుంది. ఇక టీజర్‌లోని పాత్రలు, వారు పలుకుతున్న సంభాషణలు చూస్తుంటే సినిమాను ఆద్యంతం నవ్వులు పంచేలా కట్ చేశారు. 
 
గోపీ సుందర్‌ సంగీత బాణీలు సమకూర్చగా, శివమ్‌ సెల్యులాయిడ్‌, మెయిన్‌లైన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రవి, జోజో జోస్‌, ఎన్‌.శ్రీనివాసరెడ్డి, బి. సురేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, షకలక శంకర్‌, సత్యం రాజేశ్‌, ధనరాజ్‌, ప్రకాష్‌రెడ్డి, హరితేజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

Pawan Kalyan: ఏపీ, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలు- పవన్

ఉగ్రవాదులతో పోరాడిన ముస్లిం సోదరుడు.. పారిపోలేదు.. చివరికి బుల్లెట్లకు లొంగిపోయాడు..

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments