''భరత్ అనే నేను'' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ 4/5.. రంగస్థలాన్ని?(Mahesh Video)

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన 'భరత్ అనే నేను' సినిమా తొలి రివ్యూ రిపోర్ట్ వచ్చేసింది. మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. కొరటాల-

Webdunia
గురువారం, 19 ఏప్రియల్ 2018 (18:00 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన 'భరత్ అనే నేను' సినిమా తొలి రివ్యూ రిపోర్ట్ వచ్చేసింది. మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. కొరటాల- మహేష్ కాంబోలో ఇప్పటికే తెరకెక్కిన శ్రీమంతుడు బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన మిర్చి, జనతాగ్యారేజ్ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. 
 
తాజాగా కొరటాల మహేశ్ బాబుతో రెండో సినిమా చేశాడు. ఈ చిత్రాన్ని డి.వి.వి ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా తొలి రివ్యూ రిపోర్ట్‌ను యూఏఈ సెన్సార్ సభ్యుడు ఉమర్ సాంధూ అందించాడు. ఇటీవల రామ్ చరణ్‌ రంగస్థలం సినిమాకు ఉమర్ రివ్యూ ఇచ్చాడు. రంగస్థలం సినిమాకు ఉమర్ 3.5 పాయింట్స్ రేటింగ్ ఇచ్చాడు. 
 
ప్రస్తుతం ''భరత్ అనే నేను'' చిత్రానికి ఏకంగా 4/5 రేటింగ్ ఇచ్చాడు. ఈ రేటింగ్‌ను బట్టి చూస్తే రంగస్థలం చిత్రాన్ని భరత్ అనే నేను సినిమా అధిగమిస్తుందని టాక్ వస్తోంది. భరత్ అనే నేను సినిమా మైండ్ బ్లోయింగ్‌గా వుందని, తప్పకుండా సాలిడ్ హిట్ అవుతుందని ఉమర్ సాధూ ట్వీట్ చేశాడు. మహేష్ బాబు ఇంటర్వ్యూ... Video చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments