రాత్రి నీ వీడియో చూశాను వర్మా... ఛీ.. నీ అంత...: అల్లు అరవింద్

శ్రీరెడ్డితో పవన్ కళ్యాణ్‌ను తిట్టమని చెప్పింది నేనే అంటూ రాంగోపాల్ వర్మ చెబుతూ విడుదల చేసిన వీడియో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ... రాంగోపాల్ వర్మ నా టా

Webdunia
గురువారం, 19 ఏప్రియల్ 2018 (17:38 IST)
శ్రీరెడ్డితో పవన్ కళ్యాణ్‌ను తిట్టమని చెప్పింది నేనే అంటూ రాంగోపాల్ వర్మ చెబుతూ విడుదల చేసిన వీడియో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ... రాంగోపాల్ వర్మ నా టార్గెట్. ఆలిండియా డైరెక్టర్ అయి బాంబే వెళ్లాడు. తల్లిగా భావించాల్సిన తెలుగు ఇండస్ట్రీకి ఎంత ద్రోహం చేస్తున్నాడో చెప్పేందుకే వచ్చాను.
 
రాత్రి రాంగోపాల్ వర్మ వీడియోను చూశాను. ఓ హీరోతో మాట్లాడాను. మన ఇండస్ట్రీలో ఇంత చెడ్డపేరు వస్తుంది ఎందుకని బాధపడ్డాను. ఛాతి విరుచుకుని బాహుబలి తీసింది మేమే అని ప్రపంచానికి చాటిచెప్పిన తరుణంలో ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరం. ఆర్జీ.. రాత్రి నీ వీడియో చూశానయ్యా. చాలా చండాలమైన మాటను శ్రీరెడ్డితో అనిపించేందుకు ప్రయత్నించావ్.
 
పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చెయ్యమని శ్రీరెడ్డిని అడిగాడు. ఆ తర్వాత ఆమెకు అసలు విషయం తెలియడంతో పాటు ఆమె మాట్లాడిన టేపు ఒకటి బయటకు రావడంతో భయపడిపోయిన ఆర్జీవి అప్పటికప్పుడు ఓ వీడియో క్రియేట్ చేసి దాన్ని జనంలో వదిలాడు. ఆర్జీవి నీచపు, వెధవ నాటకం, బూటకం ఎవరికి తెలియదు.
 
సురేష్ బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడా. వాళ్లు డబ్బు మాటే ఎత్తలేదు. ఇకపోతే నీ విషయం. నీకు మాత్రం రూ. 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. పవన్ కళ్యాణ్, అభిమానులపై వున్న కసిని తీర్చుకునేందుకు ఇలా చేస్తావా? నీది నీచమైన మనస్తత్వం అని అందరికీ తెలిసిందే. నీపై ఇండస్ట్రీ ఎందుకు చర్య తీసుకోకూడదు. సాఫ్ట్ మర్డర్స్ చేసే క్రిమినల్‌వి. పిచ్చివాడా... నువ్వు ఏం చేయాలన్నా నీవల్లకాదు. ఇప్పుడున్న మీడియావేరు. పదేళ్ల క్రితం వున్న పరిస్థితులు వేరు అని గుర్తుంచుకో'' అని అరవింద్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Stray Dogs: వీధికుక్కలతో తంటాలు.. వరంగల్‌లో వ్యక్తిని వెంబడించాయి.. డ్రైనేజీలో పడి మృతి

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments