Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి నీ వీడియో చూశాను వర్మా... ఛీ.. నీ అంత...: అల్లు అరవింద్

శ్రీరెడ్డితో పవన్ కళ్యాణ్‌ను తిట్టమని చెప్పింది నేనే అంటూ రాంగోపాల్ వర్మ చెబుతూ విడుదల చేసిన వీడియో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ... రాంగోపాల్ వర్మ నా టా

Webdunia
గురువారం, 19 ఏప్రియల్ 2018 (17:38 IST)
శ్రీరెడ్డితో పవన్ కళ్యాణ్‌ను తిట్టమని చెప్పింది నేనే అంటూ రాంగోపాల్ వర్మ చెబుతూ విడుదల చేసిన వీడియో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ... రాంగోపాల్ వర్మ నా టార్గెట్. ఆలిండియా డైరెక్టర్ అయి బాంబే వెళ్లాడు. తల్లిగా భావించాల్సిన తెలుగు ఇండస్ట్రీకి ఎంత ద్రోహం చేస్తున్నాడో చెప్పేందుకే వచ్చాను.
 
రాత్రి రాంగోపాల్ వర్మ వీడియోను చూశాను. ఓ హీరోతో మాట్లాడాను. మన ఇండస్ట్రీలో ఇంత చెడ్డపేరు వస్తుంది ఎందుకని బాధపడ్డాను. ఛాతి విరుచుకుని బాహుబలి తీసింది మేమే అని ప్రపంచానికి చాటిచెప్పిన తరుణంలో ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరం. ఆర్జీ.. రాత్రి నీ వీడియో చూశానయ్యా. చాలా చండాలమైన మాటను శ్రీరెడ్డితో అనిపించేందుకు ప్రయత్నించావ్.
 
పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చెయ్యమని శ్రీరెడ్డిని అడిగాడు. ఆ తర్వాత ఆమెకు అసలు విషయం తెలియడంతో పాటు ఆమె మాట్లాడిన టేపు ఒకటి బయటకు రావడంతో భయపడిపోయిన ఆర్జీవి అప్పటికప్పుడు ఓ వీడియో క్రియేట్ చేసి దాన్ని జనంలో వదిలాడు. ఆర్జీవి నీచపు, వెధవ నాటకం, బూటకం ఎవరికి తెలియదు.
 
సురేష్ బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడా. వాళ్లు డబ్బు మాటే ఎత్తలేదు. ఇకపోతే నీ విషయం. నీకు మాత్రం రూ. 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. పవన్ కళ్యాణ్, అభిమానులపై వున్న కసిని తీర్చుకునేందుకు ఇలా చేస్తావా? నీది నీచమైన మనస్తత్వం అని అందరికీ తెలిసిందే. నీపై ఇండస్ట్రీ ఎందుకు చర్య తీసుకోకూడదు. సాఫ్ట్ మర్డర్స్ చేసే క్రిమినల్‌వి. పిచ్చివాడా... నువ్వు ఏం చేయాలన్నా నీవల్లకాదు. ఇప్పుడున్న మీడియావేరు. పదేళ్ల క్రితం వున్న పరిస్థితులు వేరు అని గుర్తుంచుకో'' అని అరవింద్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments