తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న దట్ ఈజ్ మహాలక్ష్మి షూటింగ్ పూర్తి చేసుకుంది. సాధారణ యువతి నుంచి అసాధారణ మహిళగా ఎలా మారుతుందనే కథతో దటీజ్ మహాలక్ష్మి సినిమా తెరకెక్కుతుంది. ఈ మధ్యే విడుదలైన టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. త్వరలోనే చిత్రయూనిట్ విడుదల తేదీని ప్రకటించనున్నారు. మైఖెల్ ట్యాబ్యురియస్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. టైజాన్ ఖొరాకివాలా దటీజ్ మహాలక్ష్మి సినిమాను సమర్పిస్తున్నారు.
మెడైంటే ఇంటర్నేషనల్ బ్యానర్ పైన మను కుమరన్ ప్రొడక్షన్లో ఈ చిత్రం వస్తుంది. తమన్నాను ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్స్ రాజీవ్ మసంద్, అనుపమ్ చోప్రా ఇంటర్వ్య చేసి సినిమా ప్రమోషన్ను ఘనంగా మొదలుపెట్టారు. నటి పరుల్ యాదవ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు.