మన శంకరప్రసాద్‌గారిని కలిసేందుకు సైకిల్‌పై వచ్చిన మహిళా వీరాభిమాని (వీడియో)

ఠాగూర్
శుక్రవారం, 29 ఆగస్టు 2025 (15:54 IST)
మెగాస్టార్ చిరంజీవిని కలిసేందుకు ఓ మహిళా వీరాభిమాని సైకిల్‌పై వచ్చి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అదీ కూడా ఏకంగా సైకిల్‌పై హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఆమెను చిరంజీవి ఆప్యాయంగా పలుకరించారు.
 
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన రాజేశ్వరి చిరంజీవిని చూసేందుకు హైదరాబాద్‌కు సైకిల్‌పై వచ్చారు. 300 కిలోమీటర్లకు పైగా సైకిల్‌ తొక్కుతూ వచ్చి ఆయన్ను కలిశారు. మెగాస్టార్‌కి రాఖీ కట్టి మురిసిపోయారు. చిరు ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆర్థికసాయం చేసి చీరను బహుకరించారు. 
 
ఆమె పిల్లల చదువుకు సంబంధించి పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. వాళ్లు ఎంత వరకూ చదువుకుంటే అంత వరకూ చదివిస్తానని భరోసానిచ్చారు. ఇది చూసిన వారంతా దటీజ్‌ మెగాస్టార్‌ అని కామెంట్స్‌ చేస్తున్నారు. అభిమానానికి హద్దులుండవని మరోసారి నిరూపించారంటూ ఈ వీడియోను షేర్‌ చేస్తున్నారు. 
 
ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’, ‘మన శంకరవరప్రసాద్‌గారు’తో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ ఫిల్మ్‌గా ముస్తాబవుతోన్న ‘విశ్వంభర’ వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తోన్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ 2026 సంక్రాంతికి సందడి చేయనుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1.04 గిగావాట్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ. 7,500 కోట్లు మంజూరు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. కుక్కర్ల నుంచి లిక్కర్స్ వరకు.. పిల్లల్నీ వదిలిపెట్టలేదట

Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments