Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RRRతో రామ్ చరణ్ కొత్త రికార్డ్.. ఏంటదో తెలుసా?

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (18:44 IST)
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ట్రిపుల్ ఆర్. లాక్ డౌన్ వలన వాయిదా పడిన ఈ సినిమా తాజాగా మొదలైంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  
 
ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్రహీరోలు చెర్రీ, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా.
 
ఇదిలా ఉంటే, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా మార్చి నెలలో రిలీజ్ చేసిన 'భీమ్‌ ఫర్‌ రామరాజు' యూట్యుబ్‌లో రికార్డు క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ వాయిస్‌తో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. 
 
మొత్తం అయిదు భాషల్లో రిలీజ్ అయిన ఈ టీజర్‌కి వీపరితమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ టీజర్‌ను 33.3 మిలియన్ల మంది చూశారు. దీనితో అత్యధిక మంది వీక్షించిన టీజర్‌గా 'భీమ్‌ ఫర్‌ రామరాజు' రికార్డు సృష్టించింది. అటు కొమరం భీమ్ టీజర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష

Mega DSC: మెగా డీఎస్పీ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments