Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుణ్యం కట్టుకున్న కరోనా వైరస్ : 33 సార్లు తర్వాత టెన్త్ పాసయ్యాడు... (Video)

పుణ్యం కట్టుకున్న కరోనా వైరస్ : 33 సార్లు తర్వాత టెన్త్ పాసయ్యాడు... (Video)
, మంగళవారం, 28 జులై 2020 (11:11 IST)
అనేకమందికి కరోనా వైరస్ చాలా మేలు చేసింది. పది, ఇంటర్, డిగ్రీలు ఉత్తీర్ణత సాధించేందుకు అనేక ఏళ్ళుగా దండయాత్రలు చేస్తున్నారు. అయినప్పటికీ తాము రాసే పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోయారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పదో తరగతి పరీక్షలను 33 సార్లు రాశాడు. అయినప్పటికీ.. పాస్ కాలేదు. కానీ కరోనా వైరస్ పుణ్యమాని అతను ఎట్టకేలకు పాసయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని భోలక్ పూర్ అంజుమన్ బాలుర హైస్కూలులో జరిదింది. 
 
ఈ హైస్కూలులో వాచ్‌మన్‌గా పనిచేసే మహ్మద్ నూరుద్దీన్ ది ఓ విచిత్ర గాథ. ఇప్పటివరకు 33 సార్లు పదో తరగతి పరీక్షలు రాసినా పాస్ కాలేదు కానీ, కరోనా పుణ్యమా అని ఎట్టకేలకు పాసయ్యాడు. కరోనా ప్రభావంతో పది పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం అందరినీ పాస్ చేయడంతో మహ్మద్ నూరుద్దీన్ కూడా గట్టెక్కాడు. 
 
నూరుద్దీన్ తొలిసారిగా 1987లో ప్రైవేట్‌గా టెన్త్ పరీక్షలు రాశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిసారీ అపజయమే. ఇటీవలే టెన్త్ ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఫీజు కట్టాడు. కరోనా చలవతో పరీక్షలేమీ లేకపోవడంతో అందరిలాగే నూరుద్దీన్‌ను కూడా పాస్ చేశారు. 
 
దీనిపై నూరుద్దీన్ మాట్లాడుతూ, ఇన్నాళ్లు ఎక్కువగా ఇంగ్లీష్ సబ్జెక్టులోనే ఫెయిల్ అయ్యేవాడ్నని, ప్రభుత్వ ఉద్యోగం కోసమే తాను పది పరీక్షలు రాస్తున్నానని తెలిపారు. అన్నట్టు... నూరుద్దీన్‌కు ఇంటర్ చదివిన ఇద్దరు కుమారులతో పాటు బీకాం ఉత్తీర్ణురాలైన ఓ కుమార్తె ఉంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరాదిన భారీ వర్షాలు.. పిడుగుపాటుకు 11 మంది మృతి.. బీహార్‌కు చేదువార్త