Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

ఠాగూర్
గురువారం, 28 నవంబరు 2024 (12:10 IST)
అక్కినేని కుటుంబంలో వరుస వివాహ వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత హీరో నాగ చైతన్య, ఆ తర్వాత అఖిల్ అక్కినేని వివాహాలు జరుగనున్నాయి. తమ కుటుంబంలో వరుస శుభకార్యాలు జరగడంపై అగ్ర హీరో అక్కినేని నాగార్జున ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. అయితే వీరిద్దరి వివాహం ఒకే వేదికపై జరుగుతుందని జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఓ ఇంటర్వూలో తెలిపారు. 
 
2024 తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైందిగా నాగార్జు తెలిపారు. ఓవైపు ఏఎన్నార్ శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. మరోవైపు  తనయులిద్దరూ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నారని గుర్తుచేశారు. డిసెంబరు 4వ తేదీన నాగచైతన్య - శోభిత పెళ్లి జరుగనుంది. పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏఎన్నార్ స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ పెళ్లి జరగడం ఆనందంగా ఉందన్నారు. 
 
మా కుటుంబం ఎంతో పెద్దది. అదేవిధంగా శోభిత వాళ్ల కుటుంబం కూడా పెద్దదే. కుటుంబ సభ్యులు, తక్కువమంది అతిథుల సమక్షంలో వేడుకను  చేయాలనుకుంటున్నాం. అఖిల్ కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. జైనబ్ ఎంతో మంచి అమ్మాయి. ఇతరులపై ఎంతో ప్రేమ, అభిమానం కలిగివుంటుంది. వారిద్దరూ కలిసి జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉంది. అఖిల్ జీవితాన్ని ఆమె పరిపూర్ణం చేయగలదని, ఆమెను సంతోషంగా మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. వచ్చే యేడాదిలో వీరి పెళ్లి జరగనుందని నాగార్జున వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments