Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనంతపురంలో కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్‌ను ప్రారంభించిన బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున

Nagarjuna

ఐవీఆర్

, మంగళవారం, 22 అక్టోబరు 2024 (16:45 IST)
భారతదేశంలోనే అతిపెద్ద, అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్‌లలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్ ఈరోజు అనంతపురంలో 80 అడుగుల రోడ్‌, సూర్య నగర్‌ వద్ద తమ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. సూపర్‌స్టార్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ షోరూమ్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క వివిధ కలెక్షన్‌ల నుండి విస్తృతమైన డిజైన్‌లు ప్రదర్శిస్తున్నారు.
 
కళ్యాణ్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, “కళ్యాణ్ జ్యువెలర్స్‌తో నాకున్న సుదీర్ఘ అనుబంధం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. 'ట్రస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్' అనే కంపెనీ లక్ష్యంకు అనుగుణంగా వారు చూపుతున్న నిబద్ధత పరిశ్రమలో వారిని ప్రత్యేకంగా నిలుపుతుంది. ఈ రోజు మీ అందరినీ కలుసుకునే అవకాశం లభించినందుకు నేను థ్రిల్‌గా ఉన్నాను" అని అన్నారు. ఈ జ్యువెలరీ బ్రాండ్ తన మార్కెట్ ఉనికిని మరింత పటిష్టం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న వేళ, ఈ కొత్త షోరూమ్ ప్రారంభోత్సవం, ధన్‌తేరస్, దీపావళి పండుగల సీజన్‌తో సమానంగా జరిగింది. ఇక్కడ ఆభరణాల ప్రేమికులు ప్రపంచ స్థాయి వాతావరణంలో సేవా-ఆధారిత షాపింగ్ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు.
 
కొత్త షోరూమ్ గురించి కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ, “ఒక కంపెనీగా, మేము అనేకమైన మైలురాళ్లను చేరుకున్నాము. కస్టమర్ షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి అవసరమైన రీతిలో సమగ్ర పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో గణనీయమైన పురోగతిని సాధించాము. అనంతపురంలోని షోరూమ్ మా మార్కెట్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము, అదే సమయంలో మా విలువైన కస్టమర్‌లకు మరింత సౌలభ్యంను అందించనుంది" అని అన్నారు. 
 
ప్రారంభోత్సవం పురస్కరించుకుని, కళ్యాణ్ జ్యువెలర్స్ అనేక ఉత్సాహపూరితమైన ఆఫర్‌లను ప్రకటించింది. దీపావళి బొనాంజా ఆఫర్‌లో భాగంగా, వినియోగదారులు సాధారణ బంగారు ఆభరణాల కోసం మేకింగ్ ఛార్జీలపై 45% వరకు తగ్గింపును పొందగలరు. ప్రీమియం ఉత్పత్తులకు, మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 30% తగ్గింపు వర్తిస్తుంది, అయితే ఈ  ఆభరణాల బ్రాండ్ టెంపుల్  మరియు యాంటిక్ ఆభరణాల కోసం మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 35% తగ్గింపును అందిస్తోంది. షాపింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి, కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్‌లలో 30 గ్రాముల లోపు అన్ని ఆభరణాల వస్తువులపై మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 25% తగ్గింపు ఉంటుంది. ఇది కాకుండా, కళ్యాణ్ స్పెషల్ గోల్డ్ బోర్డ్ రేట్ కూడా అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏడాది కుమార్తెతో కలిసి బావిలో దూకేసిన మహిళ.. ఎందుకంటే?