ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఠాగూర్
సోమవారం, 2 డిశెంబరు 2024 (22:39 IST)
అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'పుష్ప-2'పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ దర్శకుడు. డిసెంబరు 5వ తేదీన విడుదలకానుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి హైదరాబాద్ నగర వేదికగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగింది. ఇందులో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పాల్గొని చిత్ర బృందానికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణంగా ఇలాంటి ఈవెంట్స్‌కి వెళ్లినపుడు మనం చెప్పేది ఆ సినిమాకు హెల్ప్ అయ్యేలా ఉండాలని అనుకుంటాము. కానీ, ఈ సినిమా విషయంలో ఏపీ చెప్పవలసిన అవసరంలేదు. కొన్ని నెలల క్రితం నేను ఒక పనిమీద రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లినపుడు అక్కడ 'పుష్ప-2' షూటింగ్ జరుగుతోంది. 
 
అపుడు సుకుమార్ - బన్నీ ఇద్దరితోనూ మాట్లాడాను. ఒక సీన్ చూస్తారా అని సుకుమార్ అడిగితే చూస్తాను అని అన్నారు. అపుడు నాకు పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్ చూపించారు. ఆ సీన్ చూసిన తర్వాత ఒకే ఒక మాట చెప్పాను. ఈ సీన్ దేవిశ్రీ ఎంత మ్యాజిక్‌ ఇవ్వగలిగితే అంత ఎక్స్‌లెంట్‌గా ఉంటుందని అన్నారు. నాకు తెలిపి 4వ తేదీ రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏమిటనేది ప్రపంచానికి అర్థమైపోతుంది అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Minor girl: తమ్ముడు కిందపడిపోయాడని నమ్మించి.. బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

నాలుగో తరగతి చదివే బాలిక 4వ అంతస్థు నుంచి దూకేసింది.. ఎందుకిలా? (video)

Thalapathy Vijay: మంత్రి నారా లోకేష్‌ను చూసి టీవీకే చీఫ్ విజయ్ నేర్చుకోవాలి..

పొగాకు ఉక్కుపాదం- ధూమపాన నిషేధాన్ని అమలు చేసిన మాల్దీవులు

ASI: డ్రైవర్‌కు కళ్లు కనిపించలేదా? నీళ్ల ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments