Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానటి అద్భుతంగా ఉంది : కేటీఆర్ ట్వీట్

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "మహానటి". ఈ చిత్రం బుధవారం (మే 9వ తేదీ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన అనేక మంది సెలెబ్రిటీలు తమ అభిప్రాయాన్ని

Webdunia
గురువారం, 10 మే 2018 (08:57 IST)
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "మహానటి". ఈ చిత్రం బుధవారం (మే 9వ తేదీ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన అనేక మంది సెలెబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
 
ఈ కోవలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా చేరిపోయారు. ఆయన ఈ చిత్రాన్ని చూసిన తర్వాత తన స్పందనను ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. 'మ‌హాన‌టి' చిత్రం చాలా అద్భుతంగా ఉంద‌న్నారు. నిజంగా ఈ చిత్రం ఎంత‌గానో అల‌రించింది. సావిత్రి పాత్ర‌కి కీర్తి సురేష్ జీవం పోసింది. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్నలకు తన అభినందనలు అంటూ పేర్కొన్నారు.
 
సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాగచైతన్యల నటన అద్భుతంగా ఉందని కేటీఆర్ త‌న ట్వీట్ ద్వారా కొనియాడారు. మ‌హాన‌టి చిత్రంపై ఇప్ప‌టికే రాజ‌మౌళి, రాఘ‌వేంద్ర‌రావు, అట్లీ, సుశాంత్‌, మోహ‌న్ బాబుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. కాగా, ఈ చిత్రంలో సావిత్రి పాత్ర‌ని కీర్తి సురేష్ పోషించ‌గా, జెమినీ గ‌ణేష‌న్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

హౌస్ కీపింగ్ యువకుడికి ఐ లవ్ యు చెప్పిన లేడీ డాక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది?

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments