Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎస్.గోపాల్ రెడ్డి తనయుడు సమస్య ఏంటో విశాల్‌కు తెలుసా? ఏడుస్తూ ట్వీట్ పెట్టాడు

భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత, దివంగత నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి కుమారుడు భార్గవ్ నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో సముద్రంలో పడిపోయి ఆయన దుర్మరణం పాలయ్యారు. ఈ విష‌యం తెలిసిన‌ప్ప

ఎస్.గోపాల్ రెడ్డి తనయుడు సమస్య ఏంటో విశాల్‌కు తెలుసా? ఏడుస్తూ ట్వీట్ పెట్టాడు
, బుధవారం, 9 మే 2018 (21:52 IST)
భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత, దివంగత నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి కుమారుడు భార్గవ్ నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో సముద్రంలో పడిపోయి ఆయన దుర్మరణం పాలయ్యారు. ఈ విష‌యం తెలిసిన‌ప్ప‌టి నుంచి టాలీవుడ్‌లో ఆయ‌న‌తో అనుబంధం ఉన్నవారు త‌మ సంతాపాన్ని తెలియ‌చేసారు. 
 
భార్గ‌వ్ ఆర్ట్స్ ప్రొడ‌క్ష‌న్ అధినేత గోపాల్ రెడ్డి చ‌నిపోయిన త‌ర్వాత ఆయ‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఎవ‌రు కూడా ఇండ‌స్ట్రీలో లేరు. అయితే... ఆయ‌న ఫ్యామిలీతో సాన్నిహిత్యం ఉన్న కొంతమంది సినీ ప్ర‌ముఖులు ఇంటికి వెళ్లి సంతాపాన్ని తెలియ‌చేసారు. అయితే... హీరో విశాల్ ఈ విషాద ఘటనపై  ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 
 
సొంత సోదరుడిని కోల్పోయా. ఇంత బాధకు ఎప్పుడూ గురి కాలేదు. నీ సమస్య గురించి కూడా నేను పట్టించుకోవాల్సింది. నీ జీవితానికి నువ్వే ముగింపు పలికి ఉంటావని అనుకోను. నిన్ను మిస్ అయ్యానని ట్విట్టర్ ద్వారా చెప్పాలనిపించింది. ఈ మెసేజ్ పెడుతుంటే కన్నీరు ఆగడం లేదు" అంటూ ట్వీట్ చేశాడు. మ‌రి... చ‌నిపోయిన గోపాల్ రెడ్డి త‌న‌యుడి స‌మ‌స్య ఏమిటో.. విశాల్ చెబితే బాగుండును. ఏది ఏమైనా పోయిన‌వారు తిరిగి రారు.. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుందాం..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌హేష్ 25వ సినిమా గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్