Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్‌తో మూడోసారి జతకట్టనున్న తమన్నా..

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (11:18 IST)
తమన్నా మళ్లీ విశాల్‌తో మరోసారి కలిసి స్క్రీన్‌ని షేర్ చేసుకునేందుకు సిద్ధమవుతోంది. విశాల్‌ హీరోగా దర్శకుడు సుందర్‌ సి. ఓ సినిమాను రూపొందించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. విశాల్‌ మార్క్‌ మాస్‌ యాక్షన్‌, కామెడీ అంశాల మేళవింపుగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్‌ వర్క్‌ జరుగుతోంది. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో విశాల్‌ సరసన కథానాయికగా తమన్నాని ఫైనల్‌ చేసినట్టు సమాచారం. 
 
గతంలో విశాల్‌, తమన్నా కలిసి ''కత్తి సండై'' చిత్రంలో నటించారు. ఇది మంచి విజయం సాధించింది. వీరికిది రెండో సినిమా. సుందర్‌ సి. దర్శకత్వంలో విశాల్‌ గతంలో ''మదగజరాజా'', ''ఆంబల'' చిత్రాల్లో నటించారు. వీరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రమిది. 
 
కాగా.. తమన్నా చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి', 'ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌', 'ఎన్టీఆర్‌: కథానాయకుడు', 'దేవి 2', 'దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి', 'కన్నె కలైమానె' చిత్రాల్లో నటిస్తుంది. 'ఎన్టీఆర్‌ - కథానాయకుడు'లో జయప్రద పాత్రలో మెరవనుంది.

సంబంధిత వార్తలు

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

తర్వాతి కథనం
Show comments