Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అభిమన్యుడు'' రిలీజ్‌పై విశాల్ ఏమన్నాడంటే?

విశాల్, సమంత జంటగా నటించిన ''ఇరుంబు తిరై'' సినిమా తెలుగులో అభిమన్యుడు పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలపై ఇంకా తేదీ ఖరారు కాలేదని హీరో విశాల్ స్పష్టం చేశాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (17:49 IST)
విశాల్, సమంత జంటగా నటించిన ''ఇరుంబు తిరై'' సినిమా తెలుగులో అభిమన్యుడు పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలపై ఇంకా తేదీ ఖరారు కాలేదని హీరో విశాల్ స్పష్టం చేశాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తామని తెలిపాడు.


మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్‌లోనే విడుదల చేయాలనుకున్నారు. ఇంతలోపు కోలీవుడ్ చిత్రపరిశ్రమలోని సమ్మె కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. 
 
ఇక ఈ సినిమా తెలుగు.. తమిళ భాషల్లో వచ్చేనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. అయితే ఈ తేదీన సినిమాను విడుదల చేయట్లేదని.. సినీ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదని విశాల్ తెలిపాడు. 
 
అభిమన్యుడు సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇందులో విశాల్, సమంత, అర్జున్ సర్జ తదితరులు నటించారు. ఈ సినిమాను విశాల్ కృష్ణన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజ అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపైనే మాసిన బట్టలతో రొమాన్స్ చేసుకున్న యంగ్ లవర్స్.. ఎవరంటే? (video)

బీటెక్ విద్యార్థి ప్రాణాలు తీసిన బెట్టింగ్ యాప్స్!

తల్లికి ఇద్దరు భర్తలు.. పలువురితో సన్నిహిత సంబంధం.. నచ్చకే ప్రియుడితో కలిసి హత్య

వైజాగ్‌లో కాగ్నిజెంట్ కార్యాలయం... థ్యాంక్స్ చెప్పిన మంత్రి నారా లోకేశ్

ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా రోగిపై లైంగిక దాడి.. మృతి.. ప్రారంభమైన దర్యాప్తు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments