Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్‌లో చెడు సంస్కృతి పెరుగుతోంది : విశాల్ ఆందోళన

తమిళనాడు చిత్రపరిశ్రమలో చెడు సంస్కృతి పెరిగిపోతోందని హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ ఆరోపించారు. తమిళ దర్శకనిర్మాత అశోక్ కుమార్ బుధవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దీనిపై విశాల

Webdunia
బుధవారం, 22 నవంబరు 2017 (14:39 IST)
తమిళనాడు చిత్రపరిశ్రమలో చెడు సంస్కృతి పెరిగిపోతోందని హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ ఆరోపించారు. తమిళ దర్శకనిర్మాత అశోక్ కుమార్ బుధవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దీనిపై విశాల్ ఓ లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
 
ఇందులో అశోక్‌ది ఆత్మహత్య కాదని, హత్య అని లేఖలో ఆరోపించాడు. ఫైనాన్షియర్ల ఒత్తిడి వల్ల అశోక్ ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధాకరమన్నాడు. అప్పుల బాధను తట్టుకోలేక చేసుకునే ఆత్మహత్యల్లో ఇదే చివరిది కావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఫైనాన్షియర్ల నుంచి బెదిరింపులు వస్తే వెంటనే సంఘం దృష్టికి తీసుకురావాలని కోరాడు. 
 
ఫైనాన్షియర్ల వేధింపులకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని విశాల్ పిలుపునిచ్చాడు. నిర్మాతల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కలసికట్టుగా పని చేయాలని కోరాడు. అమాయకుల మరణాలకు కారణమవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను డిమాండ్ చేశాడు. దీన్ని ఆత్మహత్యగా కాకుండా, హత్యగా పరిగణించాలని కోరాడు.
 
కాగా, తమిళ చిత్రపరిశ్రమకు చెందిన అశోక్‌కుమార్ మంగళవారం రాత్రి స్థానిక చెన్నై ఆళ్వార్ తిరునగర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెల్సిందే. తన చిత్రాల కోసం ఫైనాన్షియర్ల వద్ద అప్పులు తీసుకోవడం, వాటిని తిరిగి చెల్లించలేక పోవడంతో ఫైనాన్షియర్ల నుంచి ఒత్తిడితో పాటు బెదిరింపులు రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments