Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ ఇకలేరు...

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (10:14 IST)
బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ ఇకలేరు. బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకులోనైన ఆయన్ను ముంబైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు వయసు 67 యేళ్లు. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఆయన మరణించారు. 
 
నిజానికి రిషి కపూర్ గత కొంత కాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వచ్చారు. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన తన ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉంటూ యోగా కూడా చేస్తూ వచ్చారు. అయితే, బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ, అక్కడ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించక కన్నుమూశారు. 
 
కాగా రిషి కపూర్‌కు భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్‌బీర్ కపూర్, కుమార్తె రిద్ధిమా కపూర్ ఉన్నారు. రిషి మరణ వార్తతో బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. భారత చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందంటూ పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, బుధవారమే కేన్సర్ వ్యాధితో బాధపడుతూ వచ్చిన మరో బాలీవుడ్ నటుడు, పద్మశ్రీ గ్రహీత ఇర్ఫాన్ ఖాన్ ఇదే ముంబై నగరంలో కన్నుమూసిన విషయం తెల్సిందే. ఈయన తల్లి కూడా సోమవారం జైపూర్‌లో చనిపోయారు. తల్లి మరణంతో మరింతగా కుంగిపోయిన ఇర్ఫాన్ ఖాన్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments