Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్ర అస్వస్థతకు లోనైన బాలీవుడ్ దిగ్గజం రిషి కపూర్

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (09:09 IST)
బాలీవుడ్ దిగ్గజాల్లో ఒకరైన రిషి కపూర్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు కుటుంబ సభ్యుల సమాచారం. 
 
బుధవారం రాత్రి ఉన్నట్టుండి ఆయన రిషి కపూర్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు రణధీర్ కపూర్ వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రిషి కపూర్ వద్ద ఆయన సతీమణి నీతూ కపూర్ ఉన్నారు. పైగా, ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన కుమారుడు, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. 
 
కాగా, గత 2018లో కేన్సర్ బారినపడిన రిషి కపూర్ ఆ తర్వాత కోలుకున్నారు. రిషికపూర్ ఇటీవల ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించారు. అంతలోనే ఆయన అనారోగ్యం పాలవడం కుటుంబ సభ్యులను ఆందోళనలోకి నెట్టేసింది. 
 
లాక్‌డౌన్ సమయంలో కూడా ఆయన ఇంట్లోనే యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈ ఫోటోలను ఆయన ఆయన భార్య ఇటీవల సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments