Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో విషాదం - "త్రీ ఇడియట్స్" నటుడు కన్నుమూత

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (12:46 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతూ వచ్చిన "త్రీ ఇడియట్" చిత్ర  నటుడు అరుణ్ బాలీ ఇకలేరు. ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. 79 యేళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో గురువారం కన్నుమూశారు. 
 
గత కొంతకాలంగా నాడీ కండరాల వ్యాధి మస్తీనియా గ్రావిస్‌తో ఆయన బాధపడుతూ వచ్చారు. దీనికి చికిత్స కోసం ముంబైలోని హిర్షందాన్ని ఆస్పత్రిలో కూడా చేరారు. కానీ, ఆయన గురువారం చనిపోయారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. వీరు శుక్రవారం ముంబైకు చేరుకోనున్నారు. వారు వచ్చిన తర్వాత ఈ అంత్యక్రియలు పూర్తిచేయనున్నారు. 
 
ఇదిలావుంటే అరుణ్ బాలీ అనేక చిత్రాల్లో నటించారు. త్రీ ఇడియట్స్, కేదార్‌నాథ్, పాలిపట్, హే రామ్, దండ్ నాయక్, రెడీ, జమీన్, పోలీస్ వాలా, గుండా, రామ్ జానే వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాగే, పలు టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. అరుణ్ బాలీ నిర్మాతగా కూడా పలు చిత్రాల్లో నిర్మించి, ఒక నిర్మాతగా జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments