Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో విషాదం - "త్రీ ఇడియట్స్" నటుడు కన్నుమూత

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (12:46 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతూ వచ్చిన "త్రీ ఇడియట్" చిత్ర  నటుడు అరుణ్ బాలీ ఇకలేరు. ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. 79 యేళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో గురువారం కన్నుమూశారు. 
 
గత కొంతకాలంగా నాడీ కండరాల వ్యాధి మస్తీనియా గ్రావిస్‌తో ఆయన బాధపడుతూ వచ్చారు. దీనికి చికిత్స కోసం ముంబైలోని హిర్షందాన్ని ఆస్పత్రిలో కూడా చేరారు. కానీ, ఆయన గురువారం చనిపోయారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. వీరు శుక్రవారం ముంబైకు చేరుకోనున్నారు. వారు వచ్చిన తర్వాత ఈ అంత్యక్రియలు పూర్తిచేయనున్నారు. 
 
ఇదిలావుంటే అరుణ్ బాలీ అనేక చిత్రాల్లో నటించారు. త్రీ ఇడియట్స్, కేదార్‌నాథ్, పాలిపట్, హే రామ్, దండ్ నాయక్, రెడీ, జమీన్, పోలీస్ వాలా, గుండా, రామ్ జానే వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాగే, పలు టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. అరుణ్ బాలీ నిర్మాతగా కూడా పలు చిత్రాల్లో నిర్మించి, ఒక నిర్మాతగా జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments