Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీరియడ్స్ ఆ రెండింటికి మంచిది.. మాట్లాడేందుకు భయమెందుకు?: ఉపాసన

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (10:47 IST)
కొణిదెల కోడలు, అపోలో లైఫ్ సంస్థ అధినేత ఉపాసమ మరో కీలక అంశంపై స్పందించారు. మహిళల రుతుస్రావంపై ఆమె స్పందించారు. సాధారణంగా.. పీరియడ్స్ అనగానే చాలా మంది మహిళలు దాని గురించి మాట్లాడేందుకు భయపడతారు. 
 
అదేదో నిషిద్ధ పదం అన్నట్లు నామోషీగా ఫీల్ అవుతారు. కొందరైతే పీరియడ్స్ రాగానే.. ఎవ్వరికీ కనిపించకుండా, ఏం చెప్పకుండా దాస్తారు. అయితే.. ఇలా చేయడం ఎందుకని వారిని ఉపాసన ప్రశ్నించారు. పీరియడ్స్ అనేవి ఆరోగ్యానికి మంచివే. ఇంకా గర్భధారణకు మంచివేనని గుర్తు చేశారు. 
 
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిరుచులను, హెల్త్ టిప్స్‌ను షేర్ చేసే ఉపాసన పీరియడ్స్‌ను సీక్రెట్‌గా దాచేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు.  కొందరు ఇదంతా ఏదో చెడు అన్నట్లు భావిస్తారు. మలబద్ధకం, గ్యాస్ గురించి బహిరంగంగా మాట్లాడుతున్నపుడు దాని గురించి ఎందుకు భయం అంటూ ప్రశ్నించారు.
 
రుతుక్రమం అనేది సహజమైనదని, ఆరోగ్యానికి, గర్భం దాల్చేందుకు ఉపయోగపడేదని ఉపాసన వ్యాఖ్యానించారు. పీరియడ్స్ గురించి మాట్లాడగలిగితేనే దానికి తగిన పరిష్కారం లభిస్తుందని మహిళలకు ఉపాసన హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments