Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గర్భవతుల కడుపులో బంగారం... కిడ్నాప్ చేసి కొట్టేశారు...

గర్భవతుల కడుపులో బంగారం... కిడ్నాప్ చేసి కొట్టేశారు...
, గురువారం, 7 నవంబరు 2019 (18:19 IST)
ఆ ఇద్దరు మహిళలు గర్భందాల్చివున్నారు. వీరిద్దరూ శ్రీలంక నుంచి చెన్నైకు విమానంలో వచ్చారు. విమానం దిగిన తర్వాత తిన్నగా నడుచుకుంటూ బయటకు వచ్చారు. అయితే, కస్టమ్స్ అధికారులకు ఎక్కడో చిన్న సందేహం కలిగింది. ఆ ఇద్దరు గర్భవతుల తీరుపై అనుమానం కలిగింది. అంతే.. వారిద్దరినీ ఆపి తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. వారిద్దరూ నిజమైన గర్భవతులు కాదనీ, వారి కడుపులో బంగారం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత వారిని కారులో ఆస్పత్రికి తరలించి బంగారాన్ని వెలికి తీయాలని ప్లాన్ చేశారు. 
 
అయితే, ఈ విషయం కిడ్నాపర్లకు తెలిసింది. అంతే... ఈ మహిళలు, కస్టమ్స్ అధికారులు ప్రయాణిస్తున్న కారును పది మంది దుండగులు అడ్డుకున్నారు. ఇద్దరు మహిళలను మెరుపు వేగంతో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి ఎనిమా చికిత్స ద్వారా బంగారం వెలికి తీసి వదిలివేశారు. ఈ ఘటనతో కస్టమ్స్ అధికారులు అవాక్కయ్యారు. అంతా సినీ ఫక్కీలో క్షణాల్లో జరిగిపోయింది. 
 
మంగళవారం శ్రీలంక నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓ విమానం వచ్చింది. అందులో వచ్చిన విమాన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. వీరిలో గర్భం దాల్చినట్టు ఉన్న శ్రీలంకకు చెందిన ఫాతిమా(32), త్రిష(36)ల తీరు అనుమానాస్పదంగా కనిపించింది. వారిద్దరి కడుపులో బంగారపు ముద్దలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఎనిమా ద్వారా బయటకు తీయించేందుకు ఆస్పత్రికి కారులో బయల్దేరారు.
 
దారిలో 10 మంది దుండ గులు మహిళలను కిడ్నాప్‌ చేసి చెంగల్పట్టులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారికి ఎనిమా చేయించి కడుపులో ఉన్న బంగారాన్ని తీసుకున్నారు. అనంతరం ఆ మహిళలను మీనంబాక్కం సమీపంలో విడిచిపెట్టగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి కిడ్నాప్‌ ఉదంతంపై ఫిర్యాదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజా నిధుల పద్దులకు నిబద్దులగా పని చేద్దాం: పయ్యావుల కేశవ్