Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుట్టినింటికి రావడం ఆనందంగా ఉంది.. కల నెరవేరింది : చిరంజీవి

పుట్టినింటికి రావడం ఆనందంగా ఉంది.. కల నెరవేరింది : చిరంజీవి
, ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (13:41 IST)
చాలా కాలం తర్వాత చెన్నైకు రావడం నటుడుగా పుట్టినింటికి చాలా ఆనందంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తాను నటించిన 151 చిత్రం "సైరా నరసింహా రెడ్డి" ప్రమోషన్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఇందులో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, 'సైరా' చిత్రం తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని, అది వెండితెరపై దృశ్యరూపంగా రావడం అనేది తన కల నెరవేరిందన్నారు. 
 
స్వాతంత్య్ర సమరయోధుడైన 'సైరా నరసింహా రెడ్డి' జీవిత చరిత్రలో నటించాలని 12 ఏళ్లుగా అనుకుంటున్నాం.. ఆ కల ఇప్పుడు నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నారు. కొంత కాలం రాజకీయాలతో బిజీగా ఉండటంతో చిత్రాలకు దూరం కావలసి వచ్చిందనీ, అలాంటిది రామ్‌ చరణ్‌ నటించిన 'మగధీర' చిత్రం విజయం తనలో "సైరా నరసింహారెడ్డి" చిత్రం గురించి ఆలోచన రేపిందన్నారు.
 
రూ.70-80 కోట్ల వ్యయంతో రూపొందిన 'మగధీర' చిత్రం సక్సెస్‌ కావడంతో 'సైరా' చిత్రాన్ని భారీగా చేయవచ్చుననిపించిందన్నారు. ఆ తర్వాత "బాహుబలి 2" చిత్రం 'సైరా' చిత్రం చేయడానికి స్పూర్తినిచ్చిందన్నారు. అప్పుడు చరణ్‌తో సైరా గురించి చర్చించానన్నారు. ఆ తర్వాత రచయితలు పరచూరి బ్రదర్స్‌ సైరా కథను చెక్కడం మొదలెట్టారన్నారు. రాజకీయాలను వదిలి వచ్చిన తర్వాత "ఖైదీ నంబర్‌ 150" చేశాననీ, ఆ చిత్రం చేసేటప్పుడు కాస్త భయపడ్డాననీ, కారణం 10 ఏళ్ల గ్యాప్‌ తర్వాత చేస్తున్న చిత్రం కావడమేనన్నారు.
 
అయితే ఆ చిత్ర విజయం తనలో నమ్మకాన్ని నింపిందన్నారు. కాగా సాధారణంగా తండ్రులు కొడుకులతో చిత్రం చేస్తారనీ, ఇక్కడ తన కొడుకు తనతో చిత్రం చేయడం మంచి అనుభూతిని మిగిల్చిందన్నారు. అదేవిధంగా ఈ సినిమాలో బాలీవుడ్‌ లెజెండ్‌ అమితాబ్‌బచ్చన్‌ను నటింపజేశాలని భావించినప్పుడు, ఆయన్ని సంప్రదించగా నటించడానికి అంగీకరించడంతో 'సైరా' విజయంపై నమ్మకం కలిగిందన్నారు. అదేవిధంగా విజయ్‌సేతుపతి, నయనతార, తమన్నాలు కీలక పాత్రల్లో నటించారని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిందీ జేజెమ్మగా కరీనా కపూర్?