Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయాన్నే రాధిక ఆత్మహత్య వార్త విని బాధపడ్డా: రష్మీ గౌతమ్

యాంకర్ రాధికారెడ్డి ఆత్మహత్యపై జబర్దస్త్ యాంకర్, నటీమణి రష్మీ గౌతమ్ ఆవేదన వ్యక్తం చేసింది. వీ6 యాంకర్ రాధికారెడ్డి ఆత్మహత్య వార్తను ఉదయాన్నే వినడం, చూడటం బాధేసిందని రష్మీ గౌతమ్ చెప్పింది. రాధికను తాను

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (16:35 IST)
యాంకర్ రాధికారెడ్డి ఆత్మహత్యపై జబర్దస్త్ యాంకర్, నటీమణి రష్మీ గౌతమ్ ఆవేదన వ్యక్తం చేసింది. వీ6 యాంకర్ రాధికారెడ్డి ఆత్మహత్య వార్తను ఉదయాన్నే వినడం, చూడటం బాధేసిందని రష్మీ గౌతమ్ చెప్పింది. రాధికను తాను కలవనప్పటికీ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పింది. ప్రస్తుతం డిప్రెషన్ అనేది అతిపెద్ద సమస్యగా పరిణమించిందని తెలిపింది. 
 
ఎప్పుడైనా అప్‌సెట్ అయితే స్నేహితులతో, కుటుంబ సభ్యులతో గడపాలని సూచించింది. ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన బాధలు తొలగిపోవని ట్వీట్ చేసింది. మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఆత్మహత్య దూరం చేస్తుందని తెలిపింది. 
 
మానసిక ఒత్తిడి గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రష్మీ సూచించింది. రష్మీ ట్వీట్‌కు మరో ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఏకీభవించింది. మానసిక ఒత్తిడి అధిగమించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనసూయ తెలిపింది.
 
కాగా తెలుగు న్యూస్ ఛానల్ వీ6 కు చెందిన యాంకర్ రాధికారెడ్డి ఆపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. "నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా మెదడే నా శత్రువు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా" అని రాధిక తన సూసైడ్ లేఖలో పేర్కొన్న సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అన్నా ఒకసారి మోహం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments