Webdunia - Bharat's app for daily news and videos

Install App

తింటున్నంతసేపు ఇస్తరాకు.. తిన్నాక ఎంగిలి ఆకు...

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (16:15 IST)
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ చేసే ట్వీట్ వెనుక నిగూఢార్థం దాగివుంటుంది. అందుకే ఆయన చేసే ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియానే కాదు... టాలీవుడ్‌లో కూడా చర్చనీయాంశంగా మారింది. తింటున్నంత సేవు ఇస్తరాకు.. తిన్న తర్వాత ఎంగిలి ఆకు అంటారంటూ ఓ ట్వీట్ చేశారు. ఇలా ట్వీట్ చేయడానికి అసలు కారణ లేకపోలేదు. 
 
బండ్ల గణేష్ నిర్మాతగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రం విడుదలై ఇటీవల ఎనిమిదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ఓ ట్వీట్ చేశారు. అందులో నిర్మాత బండ్ల గణేష్ పేరును మరచిపోయారు. ఆ తర్వాత చేసిన తప్పును తెలుసుకుని మరో ట్వీట్ చేశారు. అందులో నిర్మాత బండ్ల గణేష్‌ను ఆకాశానికెత్తేశారు. దీంతో ఈ వివాదం ముగిసిపోయిందని ప్రతిఒక్కరూ భావించారు. 
 
కానీ, బండ్ల గణేష్ బాగా హర్ట్ అయినట్టున్నారు. అందుకే ఈ అంశాన్ని మనసులో పెట్టుకునే ఆయన తాజా ట్వీట్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకరేపుతున్న బండ్ల గణేష్ ట్వీట్‌ను పరిశీలిస్తే, 'తింటున్నంత సేపు ఇస్తరాకు అంటారు. తిన్నాక ఎంగిలి ఆకు అంటారు. నీతో అవసరం ఉన్నంత వరకు వరసలు కలిపి మాట్లాడతారు. అవసరం తీరాక... లేని మాటలు అంటకడతారు' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ను ఉద్దేశించే చేశారని చెప్పుకుంటున్నారు. 

 

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments