Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వ పెద్దలతో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (15:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు సోమవారం సమావేశమయ్యారు. ఇందుకోసం ఏపీ సినీ ప్రముఖులు ఏపీ సచివాలయానికి ఇప్పటికే చేరుకున్నారు. 
 
ముఖ్యంగా, తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ సర్కారు ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకు వీలుగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్‌లు, ఎక్జిబిటర్‌లు సోమవారం ఉదయం రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. 
 
ముఖ్యంగా, ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ విధానంపై సినీ ప్రముఖులు తమ వైఖరిని ప్రభుత్వానికి స్పష్టంచేయనున్నారు. ప్రభుత్వంతో సమావేశానికి ముందు 13 జిల్లాల ప్రొడ్యూసర్‌లు డిస్ట్రిబ్యూటర్‌లు, ఎక్జిబిటర్లు విజయవాడలో భేటి అయ్యారు. 
 
ప్రభుత్వం తీసుకున్న ఆన్‌లైన్ విధానానికి మద్దతు తెలుపుతూనే తమకు ఉన్న అభ్యంతరాలను ప్రభుత్వానికి ప్రతినిధులు తెలుపనున్నారు. ఇందులో అగ్ర నిర్మాతలు దిల్ రాజు, అలంకార్ ప్రసాద్, డివివి దానయ్య, సి.కళ్యాణ్, అదిశేషగిరావు, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మంత్రి పేర్ని నాని తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments