Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. 16 మంది సినీ ప్రముఖులకు క్లీన్ చిట్

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. 16 మంది సినీ ప్రముఖులకు క్లీన్ చిట్
, శనివారం, 18 సెప్టెంబరు 2021 (17:41 IST)
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చింది ఎక్సైజ్ శాఖ. 16 మంది సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చింది ఎక్సైజ్ శాఖ. ఫోరెన్సిక్ నివేదికలో డ్రగ్స్ వాడనట్లుగా నివేదిక రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఎక్సైజ్ శాఖ. 
 
2017లో ఎక్సైజ్ సిట్ దర్యాప్తు చేసిన కేసులో చార్జిషీట్ దాఖలు కాగా.. రంగారెడ్డి ఎక్సైజ్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది సిట్. 16 మంది సినీ ప్రముఖులు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలో పొందుపరచింది సిట్‌.
 
ఈ నేపథ్యం లోనే 16 మంది సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చింది ఫోరెన్సిక్ ల్యాబ్. సినీ ప్రముఖులు ఎవరూ కూడా డ్రగ్స్ వాడినట్లుగా ఆధారాలు లభ్యం కాలేదని తేల్చింది ఫోరెన్సిక్ ల్యాబ్. విచారణ సమయంలో 16 మంది దగ్గర నుంచి చేతి వేళ్ళ గోర్లు వెంట్రుకలు రక్తనమూనాలను సేకరించి ఎఫ్ఎస్ఎల్ పంపిన ఎక్సైజ్ అధికారులు. 
 
16 మంది సినీ ప్రముఖుల నమూనాల్లో డ్రగ్స్ ఆధారాలు లభ్యం కాలేదని తెచ్చింది. పూరి జగన్నాథ్, చార్మి, నవదీప్, రవితేజ, సుబ్బరాజు, తరుణ్, నందు, తనీష్, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్‌లతో పాటు ఆరుగురికి క్లీన్ చిట్ ఇచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యుల్లేక పెళ్లి ఫోటో.. హనీమూన్ ఫోటో కూడా వైరల్