Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరడుగుల బుల్లెట్ తో గోపీచంద్‌కు టైం క‌లిసివ‌స్తుందా!

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (11:36 IST)
Gopichand
క‌థానాయ‌కుడు గోపీచంద్‌కు క‌రోనా త‌ర్వాత క‌లిసివ‌స్తంద‌నేపిస్తుంది. ప్ర‌స్తుతం ఆయ‌న మూడు సినిమాలు రెడీగా వున్నాయి. అందులో చాలాకాలంనాడు చ‌క్క‌టి క‌థాంశంతో క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా `ఆరడుగుల బుల్లెట్‌. న‌య‌న‌తారా హీరోయిన్‌. బి.గోపాల్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఇప్ప‌టికీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇందుకు ప‌రిస్థితులు కూడా అనుకూలించిన‌ట్లున్నాయి. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించారు.
 
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. థియేటర్స్‌ రీ ఓపెన్‌ కాగానే ‘ఆరడుగుల బుల్లెట్‌` చిత్రాన్ని  ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్‌ చేస్తుండటం విశేషం. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను స్టార్ట్‌ చేసి విడుదల తేదీ వంటి విషయాలపై పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. గోపిచంద్, న‌య‌న‌తార కాంబినేష‌న్‌, బి. గోపాల్ డైరెక్ష‌న్‌, వ‌క్కంతం వంశీ క‌థ‌, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ కానున్నాయ‌ని నిర్మాత రమేష్ తెలిపారు. ఇంకా ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హా త‌దిత‌రులు న‌టించారు.
 
ఫొటోగ్రాఫర్‌: బాలమురగన్‌, స్రిప్ట్‌ రైటర్‌: వక్కంతం వంశీ, డైలాగ్స్‌: అబ్బూరి రవి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments