Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబరు 13న "నిప్పు - నీరు కలిసి వస్తున్నాయ్"... ఆర్ఆర్ఆర్ లేటెస్ట్ అప్‌డేట్

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (14:08 IST)
ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). డి.వి.వి.దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్ర‌స్తుతం క్లైమాక్స్ షూటింగ్ జ‌రుగుతుంది. అత్యంత పరాక్రమశాలి భీం, ఉగ్రరూపుడైన రామరాజు తమ ఉమ్మడి లక్ష్య సాధనకు సంసిద్ధులవుతున్నట్టుగా ఇటీవ‌ల చిత్ర యూనిట్ ప్రకటించింది. 
 
స్వాతంత్య్ర సమరయోధులు కొమరంభీం, అల్లూరి సీతారామరాజు చారిత్రక ఇతివృత్తానికి కాల్పనిక అంశాల్ని మేళవించి రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మేక‌ర్స్ తాజాగా స‌ర్‌ప్రైజ్ అప్‌డేట్ ఇచ్చారు. సోమవారం మ‌ధ్యాహ్నం మూవీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. అక్టోబరు 13వ తేదీన ప్రేక్షకుల ఈ చిత్రం విడుదల కానుంది.
 
నిప్పు - నీరు కలిసి ఓ శక్తిగా మీ మందుకు వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని పొందుతారని పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలో అలియాభట్‌, ఒలివియోమోరిస్‌ కథానాయికలుగా న‌టిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments