Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాసిక్‌కు దండుగా కదిలిన రైతులు ... నేడు భారీ బహిరంగ సభ

నాసిక్‌కు దండుగా కదిలిన రైతులు ...  నేడు భారీ బహిరంగ సభ
, సోమవారం, 25 జనవరి 2021 (13:39 IST)
కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉధృతంగా ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతుగా అనేక రాజకీయ పార్టీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలిచిన మహారాష్ట్రలోని 21 జిల్లాల రైతులు మొన్న (శనివారం) నాసిక్‌లో కలుసుకున్నారు.
 
కాగా, ఈ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో పంజాబ్, హర్యానా రైతులు చేస్తున్న ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్న విషయం తెల్సిందే. 
 
‘ఆల్ ఇండియా  కిసాన్’ సభ పేరుతో ఒక్కటైన రైతులు వేలాదిమంది జెండాలు, బ్యానర్లతో నాసిక్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఆదివారం సాయంత్రం ముంబై చేరుకున్నారు. సోమవారం ఆజాద్ మైదానంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ హాజరవుతారు. 
 
మరోవైపు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలో రైతులు నిర్వహించనున్న ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి లభించింది. ఇందుకోసం వందలాదిమంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దుకు చేరుకుంటున్నారు. గణతంత్ర వేడుకల తర్వాత రైతుల ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభం అవుతుంది. 
 
ప్రతి ట్రాక్టర్‌పై జాతీయ జెండా ఉంటుంది. రైతులు ఆందోళన చేస్తున్న సింఘు, టిక్రి, ఘాజీపూర్, పల్వాల్, షాజహాన్‌పూర్ సరిహద్దుల నుంచి ట్రాక్టర్ ర్యాలీ మొదలవుతుంది. అవుటర్ రింగు రోడ్డులో 100 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం సాయంత్రం ర్యాలీ ముగుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలిసొచ్చిన లాక్ డౌన్.. మరింత సంపన్నులుగా మారిన కోటీశ్వరులు