Webdunia - Bharat's app for daily news and videos

Install App

OTT: ఓటీటీ వచ్చాక థియేటర్లు చనిపోయాయి : నిర్మాత గణపతి రెడ్డి

దేవీ
గురువారం, 15 మే 2025 (16:34 IST)
Producer Ganapathi Reddy
ఓటీటీ వచ్చాక థియేటర్లు చనిపోయాయని అందుకే సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నా ప్రేక్షకులు రావడంలేదని నిర్మాత గణపతి రెడ్డి వాపోయారు. అశ్విన్ బాబు హీరోగా  వచ్చినవాడు గౌతమ్ అనే సినిమాను ఆయన నిర్మించారు. జులైలో సినిమాను విడుదలచేస్తున్నారు. ఈ సందర్భంగా చిన్న సినిమాలు అసలు బతకడంలేదనీ, అంతా ఓటీటీ మహత్యమేనని విమర్శించారు. ఈ సినిమా తీయడానికి బడ్జెట్ ఎక్కువయిందనీ, అయినా కథ పై నమ్మకంతో పెట్టుబడి పెట్టానని అన్నారు.
 
ఇంకా గణపతి రెడ్డి మాట్లాడుతూ..  అశ్విన్ గారు సినిమా కోసం చాలా కష్టపడ్డారు. దర్శకుడు కృష్ణ విజువల్స్ టేకింగ్ అదరగొట్టారు. హరి గారి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం. చాలా మంచి టీంతో పని చేశాం. ఈ సినిమాకి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను.    
 
ఇది వరకు థియేటర్ కు జనాలు ఏసి కోసం వచ్చేవారు. సినిమా ఎలా వున్నా థియేటర్ లోకి వచ్చి నిద్రపోవడానికే వచ్చేవారు. కానీ ఇప్పుడు అందరికీ ఏసి ఇండ్లలోనే వుంది. బహుశా అందుకే రాలేకపోతున్నారు. కనుక సినిమాలో వావ్ అనిపించేలా కథ వుంటేనే వస్తారు. అది మా సినిమాలో వుంటుంది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments