సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి, సురేష్ ఆత్రేయ నిర్మిస్తొన్న చిత్రం "సంత" ( మట్టి మనుషుల ప్రేమకథ ) అనేది ట్యాగ్ లైన్. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకుడు. ఓ సంత నేపధ్యంలొ ప్రేమకథగా ఫీల్ గుడ్ ఎంటర్ టైన్ మెంట్ జొనర్ లో తెరకెక్కుతొన్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సట్టిఫికెట్ పొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కథ ప్రకారం కొత్తవారైనా చక్కగా నటించారని దర్శకుడు తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో కిన్నెర, మధుమణి, జబర్దస్త్ ఫణి, ప్రసన్న, ఆర్.ఎస్.నందా, దుర్గేష్ తదితరులు నటిస్తున్నారు.