Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌కు మరో ఆప్షన్ లేదు... దక్షిణాది నటీనటులు అవసరం కావాలి : రెజీనా

ఠాగూర్
గురువారం, 30 జనవరి 2025 (13:05 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో హీరోయిన్ రెజీనా కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌కు దక్షిణాది నటీనటుల అవసరం ఎంతో ముఖ్యమన్నారు. చిత్రపరిశ్రమలో దక్షిణాది నటీనటులకు ఉండే అవకాశాలపై ఆమె స్పందించారు. 
 
'బాలీవుడ్‌ వాళ్లకు ఇప్పుడు వేరే ఆప్షన్‌ లేదు. గతంలో గడ్డు పరిస్థితులు ఉండేవి. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన తారలకు అక్కడ అవకాశాలు దొరకడం ఎంతో కష్టంగా ఉండేది. అప్పట్లో మీరు సౌత్‌ నుంచి వచ్చారని తెలిస్తే ఛాన్సులు ఇచ్చేవాళ్లు కాదు. దానికి భాషాపరమైన ఇబ్బందులు కూడా ఓ కారణమై ఉండొచ్చు. కానీ, కరోనా తర్వాత ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయి. 
 
సౌత్‌కు చెందిన సినీతారలకు ఇప్పుడు వాళ్లు కూడా అవకాశాలు ఇస్తున్నారు. తమ చిత్రాలను ఎక్కువమంది ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడం కోసం వారు దక్షిణాది తారలను ఎంచుకోవడం అవసరంగా మారింది' అని చెప్పారు. బాలీవుడ్‌లో ప్రాజెక్టులు చేయడంపై మాట్లాడుతూ ఇలాంటి ఇబ్బందులు ఏవీ తాను ఎదుర్కోలేదన్నారు. తానొక బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌కు సంతకం చేశానని త్వరలోనే దాని విశేషాలు పంచుకుంటానని అన్నారు. 
 
రెజీనా నటించిన తాజా చిత్రం ‘విదాముయార్చి’. అజిత్‌ హీరోగా దర్శకుడు మగిళ్ తిరుమేని రూపొందించారు. త్రిష కథానాయిక. అర్జున్‌ కీలక పాత్ర పోషించారు. ఇందులో అర్జున్‌కు రెజీనా జోడీగా కనిపించనున్నారు. ఫిబ్రవరి 6న ఈ సినిమా విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Good Samaritan Scheme: రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రిలో చేర్చితే.. రూ.25వేలు ఇస్తారు.. తెలుసా?

మహాకుంభమేళా తొక్కిసలాట : యూపీ సర్కారు బాధ్యత వహించాలి... సుప్రీంలో పిటిషన్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: నిరుద్యోగులకు రూ.8,500

ప్రకంపనలు సృష్టిస్తున్న చైనా ఏఐ స్టార్టప్ డీప్ సీక్!

వాషింగ్టన్ విమానాశ్రయంలో పెను ప్రమాదం- రెండు విమానాల ఢీ.. Video Goes Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments