Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌కు మరో ఆప్షన్ లేదు... దక్షిణాది నటీనటులు అవసరం కావాలి : రెజీనా

ఠాగూర్
గురువారం, 30 జనవరి 2025 (13:05 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో హీరోయిన్ రెజీనా కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌కు దక్షిణాది నటీనటుల అవసరం ఎంతో ముఖ్యమన్నారు. చిత్రపరిశ్రమలో దక్షిణాది నటీనటులకు ఉండే అవకాశాలపై ఆమె స్పందించారు. 
 
'బాలీవుడ్‌ వాళ్లకు ఇప్పుడు వేరే ఆప్షన్‌ లేదు. గతంలో గడ్డు పరిస్థితులు ఉండేవి. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన తారలకు అక్కడ అవకాశాలు దొరకడం ఎంతో కష్టంగా ఉండేది. అప్పట్లో మీరు సౌత్‌ నుంచి వచ్చారని తెలిస్తే ఛాన్సులు ఇచ్చేవాళ్లు కాదు. దానికి భాషాపరమైన ఇబ్బందులు కూడా ఓ కారణమై ఉండొచ్చు. కానీ, కరోనా తర్వాత ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయి. 
 
సౌత్‌కు చెందిన సినీతారలకు ఇప్పుడు వాళ్లు కూడా అవకాశాలు ఇస్తున్నారు. తమ చిత్రాలను ఎక్కువమంది ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడం కోసం వారు దక్షిణాది తారలను ఎంచుకోవడం అవసరంగా మారింది' అని చెప్పారు. బాలీవుడ్‌లో ప్రాజెక్టులు చేయడంపై మాట్లాడుతూ ఇలాంటి ఇబ్బందులు ఏవీ తాను ఎదుర్కోలేదన్నారు. తానొక బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌కు సంతకం చేశానని త్వరలోనే దాని విశేషాలు పంచుకుంటానని అన్నారు. 
 
రెజీనా నటించిన తాజా చిత్రం ‘విదాముయార్చి’. అజిత్‌ హీరోగా దర్శకుడు మగిళ్ తిరుమేని రూపొందించారు. త్రిష కథానాయిక. అర్జున్‌ కీలక పాత్ర పోషించారు. ఇందులో అర్జున్‌కు రెజీనా జోడీగా కనిపించనున్నారు. ఫిబ్రవరి 6న ఈ సినిమా విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments