Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారకరత్న వైద్యం కోసం బెంగుళూరుకు విదేశాల నుంచి వైద్యులు

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (10:10 IST)
ఇటీవల చిత్తూరు జిల్లా కుప్పంలో తీవ్ర అనారోగ్యానికిగురై బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో తారకరత్నకు వైద్యం చేయించేందుకు విదేశాల నుంచి వైద్యులను రప్పించారు. జనవరి నెలాఖరు నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు వైద్యం చేయించేందుకు విదేశాల నుంచి వైద్యులను రప్పించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. విదేశీ వైద్యులను రప్పించి చికిత్స అందిస్తున్నట్టు వారు వెల్లడించారు. హృద్రోగంతోపాటు నాడీ సమస్యలకు వారు చికిత్స చేస్తున్నట్టు తెలిపారు.
 
కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గత నెల 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. ఇందులో పాల్గొనేందుకు కుప్పం వెళ్లిన తారకరత్నకు గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఆయనకు తొలుత కుప్పం ఆస్పత్రిలోనూ ప్రాథమిక వైద్యం అందించి ఆ తర్వాత బెంగుళూరుకు తరలించారు. 
 
గత 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా విదేశాల నుంచి వైద్యులను రప్పించినట్టు తారకరత్న కుటుంబ సభ్యులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments