భూకబ్జా ఆరోపణల కేసు.. రానా, సురేష్ బాబులకు సమన్లు జారీ

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (00:22 IST)
టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి తండ్రి, ప్రముఖ సినీ నిర్మాత డి. సురేష్ బాబు, భూకబ్జా ఆరోపణల కేసులో న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. తనకు చెందిన భూమిని ఖాళీ చేయాలని తండ్రీ కొడుకులు ఒత్తిడి చేస్తున్నారని స్థానిక వ్యాపారవేత్త ప్రమోద్ కుమార్ దాఖలు చేసిన కేసులో 'బాహుబలి' నటుడు రానాతో పాటు సురేష్ బాబు పేరు కూడా వుంది. 
 
ఈ నేపథ్యంలో నగరంలోని నాంపల్లిలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వారికి సమన్లు ​​జారీ చేసింది.
 
షేక్‌పేటలోని వివాదాస్పద భూమిని 2014లో సురేష్ బాబు తనకు లీజుకు ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లీజు ముగియడంతో, సురేశ్ బాబు తనకు ఆస్తిని రూ.18 కోట్లకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడని, డీల్ కుదిరిందని ఆరోపించారు.
 
ఈ డీల్‌కు సంబంధించి 5 కోట్ల రూపాయలు చెల్లించగా, సేల్ - రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తి చేయడానికి సురేష్ బాబు పట్టించుకోలేదని ప్రమోద్ కుమార్ పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కాకముందే సురేష్ బాబు ఆస్తిని తన కొడుకు రానా పేరు మీదకి బదలాయించాడని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

Cyclone Ditwah: దిత్వా తుఫాను.. తమిళనాడులో భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments