Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూకబ్జా ఆరోపణల కేసు.. రానా, సురేష్ బాబులకు సమన్లు జారీ

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (00:22 IST)
టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి తండ్రి, ప్రముఖ సినీ నిర్మాత డి. సురేష్ బాబు, భూకబ్జా ఆరోపణల కేసులో న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. తనకు చెందిన భూమిని ఖాళీ చేయాలని తండ్రీ కొడుకులు ఒత్తిడి చేస్తున్నారని స్థానిక వ్యాపారవేత్త ప్రమోద్ కుమార్ దాఖలు చేసిన కేసులో 'బాహుబలి' నటుడు రానాతో పాటు సురేష్ బాబు పేరు కూడా వుంది. 
 
ఈ నేపథ్యంలో నగరంలోని నాంపల్లిలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వారికి సమన్లు ​​జారీ చేసింది.
 
షేక్‌పేటలోని వివాదాస్పద భూమిని 2014లో సురేష్ బాబు తనకు లీజుకు ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లీజు ముగియడంతో, సురేశ్ బాబు తనకు ఆస్తిని రూ.18 కోట్లకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడని, డీల్ కుదిరిందని ఆరోపించారు.
 
ఈ డీల్‌కు సంబంధించి 5 కోట్ల రూపాయలు చెల్లించగా, సేల్ - రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తి చేయడానికి సురేష్ బాబు పట్టించుకోలేదని ప్రమోద్ కుమార్ పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కాకముందే సురేష్ బాబు ఆస్తిని తన కొడుకు రానా పేరు మీదకి బదలాయించాడని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments