Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో డబ్బుల్లేవ్.. సీరియళ్లలో నటించే అన్నాచెల్లెలు ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (09:56 IST)
కరోనా మహమ్మారి సోకి వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా.. కోవిడ్ కారణంగా లాక్ డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇక దేశ వ్యాప్తంగా కూడా ముంబై, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో టీవీ నటులు షూటింగులు లేక, చేతిలో డబ్బుల్లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. 
 
ఇలానే గత మూడు నెలల నుంచి షూటింగ్స్ లేకపోవడంతో.. ఆర్థిక ఇబ్బందులతో సీరియళ్లలో నటించే అన్నాచెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలోని కొడంగయ్యూర్‌లో జరిగింది. టీవీ సీరియల్స్‌లో నటించే అన్నాచెల్లెళ్లు, శ్రీధర్, జయ కళ్యాణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారు నివసిస్తున్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు వచ్చి డోర్ పగలగొట్టి చూడగా.. అన్నాచెల్లెళ్ల మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. వీరు ఆత్మహత్య చేసుకొని కొన్ని రోజులు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments