Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజు గారి గది 3లో ఆ హీరోయిన్ భయపెట్టబోతోందా?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (11:44 IST)
ప్రముఖ వ్యాఖ్యాత ఓంకార్ తమ తమ్ముడిని హీరోగా పెట్టి, డైరెక్ట్ చేసిన రాజు గారి గది సినిమా చిన్న చిత్రం అయినప్పటికీ మంచి విజయం సాధించింది. ఇందులో ధన్య హీరోయిన్‌గా నటించింది. హారర్ నేపథ్యంలో సాగే కథనంతో రూపొందించిన ఈ సినిమాలో చివరిగా దెయ్యాలు కాదు, మొత్తం చేస్తోంది మనుషులే అని ముగించడం జరిగింది. 
 
ఇక దీనికి సీక్వెల్‌గా వచ్చిన రాజు గారి గది 2 సినిమా తీసాడు. ఇందులో సమంత దెయ్యం పాత్రలో నటించగా, నాగార్జున ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ ఓంకార్ దర్శకత్వం, సమంత, నాగార్జునల నటనకు మంచి మార్కులే పడ్డాయి.
 
తాజా ఓంకార్ రాజు గారి గది 3 తీయడానికి ప్లాన్ చేస్తున్నారంట. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం మిల్కీ బ్యూటీ తమన్నా అయితే బాగుంటుందని భావించిన ఓంకార్ ఆమెను సంప్రదించారట.
 
ఇప్పటికే అభినేత్రి సినిమాలో దెయ్యంగా నటించిన ఈ గ్లామర్ డాల్ మరి ఈ సినిమాలో నటించడంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చాలాకాలం తర్వాత ఎఫ్2తో విజయాన్ని అందుకున్న తమన్నా మళ్లీ గ్లామర్ రోల్‌లో కనిపించనుందా లేక లేడీ ఓరియెంటెడ్ పాత్రలో మెప్పించనుందో తెలియాలంటే వేచి ఉండాలి మరి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments