Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

ఠాగూర్
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (11:04 IST)
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సినీ నటి తమన్నా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఆమె వద్ద ఈడీ అధికారులు గౌహతి కార్యాలయంలో ఏకంగా 8 గంటల పాటు విచారించారు. హెచ్.పి.జడ్ టోకెన్ యాప్‌లో పలువురు ఇన్వెస్ట్ చేసి మోసపోయారని యాప్‌పై కేసులున్నాయి. ఈ యాప్‌కు సంబంధించిన ఓ ఈవెంట్‌కు తమన్నా హాజరైందని, అందుకోసం డబ్బు తీసుకుందని ఆరోపణలపై ఆమెను ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసులో ఆమె హాజరై ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, హెచ్పీజెడ్ టోకెన్ మొబైల్ యాప్‌నకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తమన్నా భాటియాను ప్రశ్నించినట్లు ఈడీ అధికార వర్గాలు తెలిపాయి. బిట్ కాయిన్ సహా పలు క్రిప్టో కరెన్సీ మైనింగ్ పేరిట ఇన్వెస్టర్లను హెచ్.పి.జడ్ టోకెన్ మొబైల్ యాప్ మోసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఈడీ ఈ యాప్ నిర్వాహకాన్నీ తేల్చే పనిలో ఉంది. హెచ్.పి.జడ్ టోకెన్ మొబైల్ యాప్‌కు సంబంధించిన ప్రతి ఒక్కరిని ఈడీ ప్రశ్నిస్తోంది.
 
అందులో భాగంగానే ప్రముఖ నటి తమన్నాను గురువారం ఈడీ అధికారులు గౌహతి కార్యాలయంలో విచారించింది. ఈడీ అధికారులు తమన్నా నుండి వాంగ్మూలం సేకరించారు. హెచ్.పి.జడ్ టోకెన్ మొబైల్ యాప్ లో ఎవరైనా రూ.57 వేల పెట్టుబడి పెడితే మూడునెలల పాటు రోజుకు రూ.4వేల రూపాయలు తిరిగి ఇస్తామని నిర్వాహకులు భారీ ఈవెంట్స్ వంటివి పెట్టి కస్టమర్స్‌ను నమ్మించారు. 
 
అలా ఈ అప్లికేషన్‌కు సంబంధించిన ఓ ఈవెంట్‌కు తమన్నా హాజరై యాప్‌ను ప్రమోట్ చేశారు. దీంతో ఈ యాప్‌లో భారీగా డబ్బులు పెట్టారు. అలా నమ్మి పెట్టుబడి పెట్టిన వారికి ఒక నెల డబ్బులు చెల్లించి నమ్మకం కలిగేలా చేసి ఆ తర్వాత నెల నుండి ఏవో సాకులు చెప్తూ డబ్బులు చెల్లించడం ఆపేసారు. నిందితులు పెట్టుబడిదారులను మోసం చేసేందుకు 'హెచ్పీజెడ్ టోకెన్' మొబైల్ ఫోన్ అప్లికేషను ఉపయోగించారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఈడీ దాడులు నిర్వహించి రూ.455 కోట్ల విలువైన స్థిరాస్తులు, డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నది. ఈ కేసులో తమన్నా భాటియా చిక్కుల్లో పడ్డారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి... లారెన్స్ బిష్ణోయ్ గ్రూపు వార్నింగ్

జగన్నాథ్ మహాప్రసాదంలో దేశీ నెయ్యినే వాడుతున్నారా?

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీమ్‌లోకి ఆమ్రపాలి

బీహార్ కల్తీసారా ఘటన : 32కు చేరిన మృతులు - అంపశయ్యపై మరికొందరు..

రెస్టారెంట్లలో బిర్యానీ తినాలంటే భయం.. పన్నీర్ బిర్యానీలో చికెన్ ముక్కలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments