Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

tamannah

సెల్వి

, గురువారం, 17 అక్టోబరు 2024 (22:38 IST)
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాకు కష్టాలు మొదలయ్యాయి. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తమన్నా వద్ద విచారణ జరిపారు. ఇంతకీ తమన్నాను ఈడీ ఎందుకు ప్రశ్నించిందనే వివరాల్లోకి వెళితే.. బెట్టింగ్ యాప్ కేసులో ఆమెను విచారించారు. 
 
ఇటీవల ఈడీ తమన్నాకు సమన్లు జారీ చేయగా, గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు గౌహతిలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. ఈ సమయంలో ఆమె తల్లి కూడా ఆమెతో వచ్చారు. దాదాపు ఐదు గంటల పాటు ఈడీ తమన్నా వద్ద విచారణ జరిపింది. 
 
ఈ సందర్భంలో తమన్నా భాటియాను నిందితురాలిగా విచారించడం లేదు. కానీ హెచ్‌పీజెడ్ టోకెన్ యాప్‌కు ప్రచారం చేసినందుకు ఆమె వద్ద విచారిస్తున్నారు. ఈ యాప్ ద్వారా ప్రజలు రూ. 57,000 పెట్టుబడి పెడితే రోజుకు రూ.4,000 ఇస్తామని హామీ ఇచ్చారు. దీని ద్వారా కోట్లాది మంది డబ్బులు పెట్టి మోసపోయారు. ఈ విషయం కూడా మహాదేవ్ యాప్ స్కామ్‌తో ముడిపడి ఉంది. ప్రజలు దీని ద్వారా డబ్బు సంపాదించి మహాదేవ్ బెట్టింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టేవారు.
webdunia
Tamannah
 
ఈ కేసులో ఇప్పటి వరకు రూ. 497.20 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. ఇప్పటికే ఓసారి ఈడీ ముందు హాజరైన తమన్నాకు.. ఈ యాప్ ప్రమోషన్‌లో భాగంగా మళ్లీ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్