Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ కేసు : రియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు... మరో కేసు, ఏక్షణమైనా అరెస్టు

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (08:10 IST)
ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు ఇపుడు కీలక మలుపుతిరిగింది. ముఖ్యంగా ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 
 
రియా చక్రవర్తి డ్రగ్ డీలరుతో జరిపిన వాట్సాప్ చాటింగ్.. సుశాంత్ కేసులో మాదకద్రవ్యాల మాఫియా ప్రమేయాన్ని బహిర్గతం చేసింది. దీంతో.. రియా చక్రవర్తికి, డ్రగ్స్ మాఫియాకు సంబంధాలున్నట్లు గుర్తించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసింది.
 
ముఖ్యంగా, డ్రగ్ డీలర్ గౌరవ్ ఆర్యతో రియా వాట్సాప్ చాటింగ్ చేసిందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చాట్‌ను తన ఫోన్ నుంచి రియా డిలీట్ చేసినా... అధికారులు దాన్ని తిరిగి పొందారు. రియాకు, డ్రగ్స్ మాఫియాకు సంబంధాలు ఉన్నాయని నిర్ధారించుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆమెతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసింది.
 
మాదకద్రవ్యాల డీలరుతో రియా చక్రవర్తి జరిపిన చాటింగ్ బండారం బయటపడటంతో ఈ కేసులో మాదకద్రవ్యాల కుట్ర కూడా ఉందనే అనుమానం రేకెత్తింది. సీబీఐ దర్యాప్తులో రియాకు సంబంధించిన కీలక విషయాలను సుశాంత్‌ స్నేహితుడు పితాని సిద్ధార్థ్‌ వెల్లడించాడు.
 
గత జూన్‌ 8వ తేదీన సుశాంత్‌తో రియా చక్రవర్తి గొడవపడిందని అతను విచారణలో బయటపెట్టాడు. జూన్ 15న సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గమనార్హం. సుశాంత్‌ నివాసంలో ఆధారాలు దొరక్కుండా 8 హార్డ్‌ డిస్క్‌లు ధ్వంసం చేశారని, ఆసమయంలో సుశాంత్‌ మేనేజర్‌ దీపేష్‌, వంటమనిషి ధీరజ్‌ ఉన్నారని సిద్ధార్థ్‌ చెప్పాడు. 
 
హార్డ్‌ డిస్క్‌ల్లో ఏముందో తనకు తెలియదని సిద్ధార్థ్ విచారణలో తెలిపాడు. రియా సమక్షంలోనే హార్డ్‌ డిస్క్‌ల ధ్వంసం జరిగినట్లు సీబీఐకి ఆధారాలు లభించాయి. దీంతో.. డ్రగ్స్‌ లింకుతో రంగంలోకి దిగిన నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బోర్డు రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: పార్టీకి, పదవికి రాజీనామా చేసిన కవిత.. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది (video)

Red Alert: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్

Seaplane: మార్చి నాటికి తిరుపతి కల్యాణి డ్యామ్‌లో సీప్లేన్ సేవలు

North Andhra: అల్పపీడనం- ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరప్రాంతంలో భారీ వర్షాలు

సంగారెడ్డిలో చిరుతపులి కలకలం.. దూడను చంపింది.. నివాసితుల్లో భయం భయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments