Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకంపనలు రేపుతున్న సుశాంత్ ఆత్మహత్య - రియా చక్రవర్తి బ్రదర్ అరెస్టు

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (22:32 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణ ఇపుడు ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు సీబీఐకు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ.. కూపీలాగగా బాలీవుడ్‌లోని డ్రగ్ మాఫియా మూలాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా, సుశాంత్ ప్రియురాలు నటి రియా చక్రవర్తికి మాదకద్రవ్య వ్యాపారులతో సంబంధాలు ఉన్నట్టు తేలింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కేసు నమోదు చేసింది. 
 
ఈ క్రమంలో రియా చక్రవర్తి సోదరుడు శౌవిక్ చక్రవర్తిని అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో శామ్యూల్ మిరాండాను కూడా ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో రియాను, ఆమె తండ్రిని కూడా సీబీఐ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్, ఎన్‌సీబీ అధికారులు కూడా ప్రశ్నించారు.  
 
జూన్ 14న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ కేసులో ఆయన గాళ్‌ఫ్రెండ్ పాత్రపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సీబీఐ విచారణ కొనసాగుతోంది. నేడో రేపో రియాను కూడా అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.
 
ఇదిలావుండగా, సుశాంత్ ఆత్మహత్య కేసు ఇపుడు అనేక మలుపులు తిరిగి చివరకు డ్రగ్స్ దందావైపు టర్న్ తీసుకుంది. డ్రగ్స్‌ కోణం బయట పడిన తర్వాతే ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలయ్యింది. తొలుత ముంబై పోలీసులతో మొదలైన ఈ కేసు విచారణలో.. సీబీఐ, ఈ, ఎన్‌సీబీ కూడా ఎంటరయ్యింది. వీటి వెనుక అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments