Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్జీ గేమ్‌కు బదులు ఫౌజీ గేమ్‌.. అనౌన్స్ చేసిన అక్షయ్ కుమార్

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (22:07 IST)
FAU-G
భారత్-చైనా సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. భారత ప్రభుత్వం ఇటీవలే 118 చైనీస్ యాప్స్‌పై నిషేధం విధించింది. ఇందులో పబ్జీ కూడా ఉన్నది. భారత్‌లో దాదాపుగా 20 కోట్ల మంది పబ్జీ గేమ్ యూజర్లు ఉన్నారు. పబ్జీ గేమ్‌పై నిషేధం విధించిన తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఫౌజీ గేమ్‌ను అనౌన్స్ చేశారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఫౌజీ గేమ్‌ను లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. 
 
అక్టోబర్ నెలలో ఈ గేమ్ రిలీజ్ కాబోతోంది. పూర్తి స్థాయి యాక్షన్‌తో సాగే ఈ గేమ్ ఆధ్యంతం ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నట్టు అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మల్టీప్లేయర్ గేమ్‌కు సంబంధించిన పోస్టర్‌ను అక్షయ్ కుమార్ రిలీజ్ చేశారు. భారత సైనికుల త్యాగాల గురించి ఈ గేమ్ తెలియజేస్తుందని అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
 
ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్‌ భారత్‌కు మద్దతుగా ఫియర్‌లెస్‌ అండ్‌ యునైటెడ్‌ గార్డ్స్‌ (ఎఫ్ఎయూ-జీ)ను పరిచయం చేస్తున్నందుకు సగర్వంగా ఉంది. వినోదంతో పాటు ఆటగాళ్లు మన వీర సైనికుల త్యాగాల గురించి కూడా నేర్చుకుంటారు. గేమ్‌ ద్వారా వచ్చే నికర ఆదాయంలో 20శాతాన్ని భారత్‌కే వీర్‌ ట్రస్ట్‌కు విరాళంగా ఇవ్వబడుతుందని అక్షయ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశాడు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

YS Jagan : జగన్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న బాలిక.. సెల్ఫీ తీసుకున్న వైకాపా చీఫ్(video)

ఆ అమ్మాయితో వాట్సప్ ఛాటింగ్ ఏంట్రా?: తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments