Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్‌కి నిర్మాతలు కావాలి, రంగంలోకి దిగిన రామ్ చరణ్‌

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (19:10 IST)
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ కరోనా రాకుండా ఉంటే, ఈపాటికే రిలీజ్ అయ్యేది. ఇప్పుడు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలావుంటే.. అఖిల్ - సురేందర్ రెడ్డితో సినిమా చేయనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ.. అఫిషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు.
 
దీనికి కారణం ఏంటంటే... ఈ మూవీకి దాదాపు 40 కోట్లు బడ్జెట్ కావాలట. ముందుగా ఈ మూవీని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన క్రిష్ నిర్మించాలి అనుకున్నారు కానీ.. అఖిల్ పైన అంత బడ్జెట్ వర్కవుట్ కాదని తప్పుకున్నారు.
 
 ఆ తర్వాత 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఈ మూవీని నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి కానీ.. వాళ్లు కూడా ఆలోచనలోపడ్డారని టాక్. కథ నచ్చింది... డైరెక్టర్ సురేందర్ రెడ్డి రెడీగా ఉన్నారు కానీ.. ఈ సినిమాకి డబ్బులు పెట్టే నిర్మాతే లేడు.
 
అందుకనే అసలు విషయం తెలుసుకున్న రామ్ చరణ్... అఖిల్ కోసం రంగంలోకి దిగినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమాని సెట్ చేసే పనిలోనే ఉన్నారని... త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్లారిటీ వస్తుందని తెలిసింది. మరి.. అఖిల్ కోసం రిస్క్ చేసే ఆ ప్రొడ్యూసర్ ఎవరో..? ఎప్పుడు స్టార్ట్ చేస్తారో..? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments