Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్‌కి నిర్మాతలు కావాలి, రంగంలోకి దిగిన రామ్ చరణ్‌

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (19:10 IST)
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ కరోనా రాకుండా ఉంటే, ఈపాటికే రిలీజ్ అయ్యేది. ఇప్పుడు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలావుంటే.. అఖిల్ - సురేందర్ రెడ్డితో సినిమా చేయనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ.. అఫిషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు.
 
దీనికి కారణం ఏంటంటే... ఈ మూవీకి దాదాపు 40 కోట్లు బడ్జెట్ కావాలట. ముందుగా ఈ మూవీని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన క్రిష్ నిర్మించాలి అనుకున్నారు కానీ.. అఖిల్ పైన అంత బడ్జెట్ వర్కవుట్ కాదని తప్పుకున్నారు.
 
 ఆ తర్వాత 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఈ మూవీని నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి కానీ.. వాళ్లు కూడా ఆలోచనలోపడ్డారని టాక్. కథ నచ్చింది... డైరెక్టర్ సురేందర్ రెడ్డి రెడీగా ఉన్నారు కానీ.. ఈ సినిమాకి డబ్బులు పెట్టే నిర్మాతే లేడు.
 
అందుకనే అసలు విషయం తెలుసుకున్న రామ్ చరణ్... అఖిల్ కోసం రంగంలోకి దిగినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమాని సెట్ చేసే పనిలోనే ఉన్నారని... త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్లారిటీ వస్తుందని తెలిసింది. మరి.. అఖిల్ కోసం రిస్క్ చేసే ఆ ప్రొడ్యూసర్ ఎవరో..? ఎప్పుడు స్టార్ట్ చేస్తారో..? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Covid: తిరుపతిలో పది నెలల బాలికకు కోవిడ్-19: అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పాజిటివ్

Asaduddin Owaisi: కొంచెం ఆత్మపరిశీలన చేసుకోండి.. మూర్ఖత్వమే కదా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments