Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శ్రీమంతుడు' నందియాత్ర.. ఖాతాలో ఎనిమిది నందులు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. సరికొత్త కథ, కథనాలతో చిత్రాలు చేస్తూ అభిమానులను విశేషంగా ఆలరిస్తున్నాడు. ‘రాజకుమారుడు’తో వెండితెర కథానాయకుడిగా తొలిసారి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ఘట్టమనేని వారసుడు..

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (09:44 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. సరికొత్త కథ, కథనాలతో చిత్రాలు చేస్తూ అభిమానులను విశేషంగా ఆలరిస్తున్నాడు. ‘రాజకుమారుడు’తో వెండితెర కథానాయకుడిగా తొలిసారి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ఘట్టమనేని వారసుడు.. అరంగేట్ర చిత్రంతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ మంచి స్టార్‌డమ్‌‌ను సొంతం చేసుకున్నాడు.
 
తన తొలి చిత్రానికే ఉత్తమ అరంగేట్ర నటుడిగా 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ‘నంది’ పురస్కారాన్ని అందుకున్నాడు. తాజాగా ఈయనకు మరోసారి నందిపురస్కారం వరించింది. 2015 సంవత్సరానికి ఉత్తమ నటుడు (శ్రీమంతుడు) పురస్కారం ఆయనకు వరించింది. ఓ ఊరిని దత్తత తీసుకోవాలనే ఉన్నతమైన ఆశయంతో ‘శ్రీమంతుడు’ చిత్రం తెరకెక్కి విశేష ప్రేక్షకాదరణ పొందిన విషయం తెల్సిందే. తాజాగా ప్రకటించిన నంది పురస్కారంతో కలిపి మొత్తం ఎనిమిది నందులు మహేష్‌ ఖాతాలో చేరాయి.
 
మహేష్‌ ‘నంది’యాత్ర 2000 నుంచి 2006 వరకు కొనసాగింది. వీటిలో ఉత్తమ నటుడు, స్పెషల్‌ జ్యూరీ అవార్డులు ఉన్నాయి. తొలి చిత్రం ‘రాజకుమారుడు’తో మొదటి సారిగా నంది పురస్కారం అందుకున్న మహేష్‌కు.. 2002లో ‘మురారి’, 2003లో ‘టక్కరిదొంగ’, 2005లో ‘అర్జున్‌’ చిత్రాలకు స్పెషల్‌ జ్యూరీ కేటగిరీలో అవార్డులు వరించాయి. 2004లో ‘నిజం’, 2006లో ‘అతడు’, 2012లో ‘దూకుడు’ చిత్రాల్లో నటనకు ‘ఉత్తమ నటుడు’గా నంది అవార్డులకు ఎంపికయ్యారు. మహేష్‌కు వచ్చిన ఎనిమిది నంది అవార్డుల్లో నాలుగు ‘ఉత్తమ నటుడు’ పురస్కారాలే కావడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగయ్య మృతి : పోలీసుల అదుపులో వైఎస్ జగన్ కారు డ్రైవర్

దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా తీయాలనుకుంటున్నా : బాలకృష్ణ

పహల్గాం ఉగ్రదాడి.. ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరి అరెస్టు

జగన్‍‌కు పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది.. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్... మంత్రి గొట్టిపాటి

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments