చంపేస్తానంటున్నారు.. రక్షణ కల్పించండి : దర్శకుడు కేతిరెడ్డి

తనను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయనీ, అందువల్ల తనకు రక్షణ కల్పించాలని లక్ష్మీస్ వీరగ్రంథం దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఈమేరకు ఆయన రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు ఓ లేఖ

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (09:24 IST)
తనను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయనీ, అందువల్ల తనకు రక్షణ కల్పించాలని లక్ష్మీస్ వీరగ్రంథం దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఈమేరకు ఆయన రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు ఓ లేఖ సమర్పించారు. 
 
రెండ్రోజుల క్రితం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ముహూర్తపు షాట్‌ను చిత్రీకరించేందుకు కేతిరెడ్డి ప్రయత్నించారు. అయితే, పోలీసులు ఆయనకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే లక్ష్మీపార్వతి అభ్యంతరాలను వ్యక్తపరుస్తున్నారని చెప్పారు. లక్ష్మీపార్వతి వైఖరిని ఎండగడతానని శపథం చేశానని తెలిపారు. 
 
అందువల్లే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలంటూ ఏపీ, తెలంగాణ డీజీపీలను కోరారు. మరోవైపు, కేతిరెడ్డిలాంటి పాపుల రాకతో ఎన్టీఆర్ ఘాట్ అపవిత్రమైందని పేర్కొంటూ... ఎన్టీఆర్ సమాధికి పాలాభిషేకం చేశారు లక్ష్మీపార్వతి. తనను, ఎన్టీఆర్‌ను అగౌరవపరిచేందుకే ఈ సినిమాను తీస్తున్నారని మండిపడ్డారు. తల్లి, చెల్లి ఉన్నవారు ఇలాంటి పనులు చేయరని ఆమె దుయ్యబట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments