Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంపేస్తానంటున్నారు.. రక్షణ కల్పించండి : దర్శకుడు కేతిరెడ్డి

తనను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయనీ, అందువల్ల తనకు రక్షణ కల్పించాలని లక్ష్మీస్ వీరగ్రంథం దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఈమేరకు ఆయన రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు ఓ లేఖ

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (09:24 IST)
తనను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయనీ, అందువల్ల తనకు రక్షణ కల్పించాలని లక్ష్మీస్ వీరగ్రంథం దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఈమేరకు ఆయన రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు ఓ లేఖ సమర్పించారు. 
 
రెండ్రోజుల క్రితం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ముహూర్తపు షాట్‌ను చిత్రీకరించేందుకు కేతిరెడ్డి ప్రయత్నించారు. అయితే, పోలీసులు ఆయనకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే లక్ష్మీపార్వతి అభ్యంతరాలను వ్యక్తపరుస్తున్నారని చెప్పారు. లక్ష్మీపార్వతి వైఖరిని ఎండగడతానని శపథం చేశానని తెలిపారు. 
 
అందువల్లే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలంటూ ఏపీ, తెలంగాణ డీజీపీలను కోరారు. మరోవైపు, కేతిరెడ్డిలాంటి పాపుల రాకతో ఎన్టీఆర్ ఘాట్ అపవిత్రమైందని పేర్కొంటూ... ఎన్టీఆర్ సమాధికి పాలాభిషేకం చేశారు లక్ష్మీపార్వతి. తనను, ఎన్టీఆర్‌ను అగౌరవపరిచేందుకే ఈ సినిమాను తీస్తున్నారని మండిపడ్డారు. తల్లి, చెల్లి ఉన్నవారు ఇలాంటి పనులు చేయరని ఆమె దుయ్యబట్టారు. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments