Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్ బాబు ముఖ్యమంత్రి అయితే.. పోసానీ కృష్ణ మురళీ విపక్ష నేత?

స్పైడర్ సినిమాకు తర్వాత మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా... హైదరాబాద్‌లో సీఎం చాంబర్ సెట్‌లో చిత్రీ

Advertiesment
mahesh babu
, సోమవారం, 6 నవంబరు 2017 (10:36 IST)
స్పైడర్ సినిమాకు తర్వాత మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా... హైదరాబాద్‌లో సీఎం చాంబర్ సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. మహేశ్‌తో పాటు ముఖ్య పాత్రధారులంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. అసెంబ్లీ సీన్లను చిత్రీకరిస్తున్నారు. 
 
ఈ సినిమాతోనే తెలుగు తెరకి కథానాయికగా కైరా అద్వానీ పరిచయమవుతోంది. కొరటాల-మహేశ్ కాంబినేషన్లో తొలుత శ్రీమంతుడు తెరకెక్కగా, రెండో సినిమాగా భరత్ అనే నేను రిలీజ్ కానుంది. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. 
 
పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో.. తండ్రి మరణించడంతో ఆ స్థానంలో సీఎం అయిన యువకుని పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారు. అసెంబ్లీతో పాటు చాంబర్ సన్నివేశాల కోసం రూ.5కోట్ల ఖర్చుతో సెట్ వేశారు. ఈ సెట్లో తీసే సన్నివేశాలు సినిమాకు కీలకం కానున్నాయని సినీ యూనిట్ వెల్లడించింది. ఇక పోసానీ కృష్ణమురళీ ఈ చిత్రంలో విపక్ష నేతగా కనిపిస్తారట. 
 
పోసానీ, మహేష్‌ల మధ్య సాగే సన్నివేశాలు ఆసక్తికరంగా వుంటాయని.. ఫుల్ రొమాన్స్, యాక్షన్ చిత్రంగా ఈ సినిమా వుంటుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమల్, నేను విడిపోవడానికి శ్రుతిహాసన్ కారణం కాదు: నటి గౌతమి