Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే రకం పోస్టర్లను వదిలిన సూపర్‌స్టార్, స్టైలిష్‌స్టార్

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (17:40 IST)
టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి మొదలైంది. సాధారణంగా సంక్రాంతి తెలుగిళ్లల్లో చాలా సందడిగా ఉంటుంది... అయితే టాలీవుడ్‌లో కూడా అదే సందడి ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. కాగా, ఈ సంక్రాంతికి సందడి చేసేందుకు సూపర్‌స్టార్ అలాగే స్టైలిష్ స్టార్ కూడా రెడీ అయిపోయారు.
 
వివరాలలోకి వెళ్తే... టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలు రెండూ కూడా ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ పోస్టర్‌లు తాజాగా విడుదలయ్యాయి. అయితే, ఈ రెండు సినిమాలకు సంబంధించిన పోస్టర్లు ఒకేలా కనిపిస్తూండడం ఇక్కడ చర్చనీయాంశమైంది.
 
అయితే.. తాజాగా విడుదల చేయబడిన ‘సరిలేరు నీకెవ్వరు’ పోస్టర్‌లో మహేష్ బాబు కొండారెడ్డి బురుజు ముందు ఓ బల్లపై కూర్చుని పక్కకు చూస్తూ నవ్వుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇక ‘అల వైకుంఠపురంలో’ సినిమా పోస్టర్‌ను చూస్తే అల్లు అర్జున్ ఓ గట్టుపై తాపీగా కూర్చుని సిగరెట్ కాలుస్తూ నవ్వుతున్నట్లు కనిపిస్తున్నారు. 
 
మొత్తానికి ఈ ఇద్దరు స్టార్ హీరోలు కూర్చుని ఇచ్చిన పోజ్ మాత్రం కేక పెట్టిస్తోంది. మరి సంక్రాంతి బరిలోకి దూకుతున్న ఈ రెండు సినిమాలకు పోస్టర్‌లు ఒకే విధంగా ఉన్నా, ప్రేక్షకులు దేనిని ఎక్కువగా ఆదరిస్తారో వేచి చూద్దాం..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments